యాప్నగరం

ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పు..

1993 మార్చి 12న ముంబై నగరంలో 12 ప్రదేశాల్లో వరస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. 257 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది..

TNN 18 Jun 2017, 12:38 pm
1993 ముంబై పేలుళ్ల కేసుపై టాడా కోర్టు.. తీర్పు వెలువరించింది. అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం, ముస్తఫా దొస్సా, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్, కరీముల్లా ఖాన్, ఫిరోజ్ ఖాన్‌ను దోషులుగా ప్రకటించింది. ఈ ఆరుగురు నిందితులకు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. ఏడో వ్యక్తి అబ్దుల్ ఖయ్యూంను విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడుగురిని 2003 నుంచి 2010 మధ్య కాలంలో అరెస్టు చేశారు. అబూ సలేంను 2005లో పోర్చుగల్‌లో అరెస్టు చేశారు. రాయ్‌ఘడ్‌లోని తలోజా సెంట్రల్ జైలులో ఉన్న ఇతణ్ని ఇవాళ (జూన్ 16) ఉదయం ప్రత్యేక వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. 24 ఏళ్ల తర్వాత ఈ కేసులో కీలక తీర్పు వెలువడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Samayam Telugu mumbai blasts case abu salem 5 others held guilty 1 acquitted
ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పు..


1993 మార్చి 12న ముంబై నగరంలో 12 ప్రదేశాల్లో వరస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. 257 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఘటనలో మరో 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు టైగర్ మెమన్, యాకుబ్ మెమన్‌ ఈ పేలుళ్ల కుట్రకు ప్రధాన సూత్రదారులుగా గతంలోనే గుర్తించారు.

నిందితులపై బాంబు పేలుళ్లకు కుట్రపన్నడం, ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం, హత్యా నేరాల కింద కేసులు నమోదయ్యాయి. దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ దేశం విడిచి పారిపోగా.. పోలీసులు యాకుబ్‌ను అరెస్టు చేశారు. 2015 జులై 30న నాగ్‌పూర్ జైలులో యాకుబ్‌కు ఉరిశిక్ష అమలు చేశారు.‌

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.