యాప్నగరం

ముంబై రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 22 మంది మృతి

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికులు నడిచే వంతెనపై తొక్కిసలాట జరిగింది.

TNN 29 Sep 2017, 12:34 pm
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికులు నడిచే వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ స్టేష‌న్‌లో లోకల్‌ ట్రెయిన్లు ఎక్కువగా ఆగుతుంటాయి. భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా జనం లోపలికి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 10.30 ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు, వైద్యులు, రైల్వే సిబ్బంది హుటాహుటీన రైల్వేస్టేషన్‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. క్షతగ్రాతులను పరామర్శించేందుకు ఆయన ఘటనాస్థలికి బయలుదేరారు.
Samayam Telugu mumbai elphinstone railway station stampedeat overbridge 15 dead and several injured
ముంబై రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 22 మంది మృతి


ఈ తొక్కిసలాటకు భారీ వర్షంతోపాటు పండగ రద్ధీ కూడా కారణమని రైల్వే అధికారులు ప్రకటించారు. ఆఫీసుకు వెళ్లే సమయం కావడం, పండగకు స్వంత ఊళ్లకు వెళ్లేవారితో రైల్వే‌స్టేషన్ కిక్కిరిసి ఉంది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా జనం లోనికి చొచ్చుకువచ్చారని అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.