యాప్నగరం

ఛత్రపతి స్టేషన్: షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు

ముంబైలోని ప్రముఖ రైల్వే స్టేషన్ ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌టీఎమ్)’ అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడింది. మంగళవారం (మే 29) మధ్యాహ్నం స్టేషన్లో నిలిపి ఉంచిన షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి.

Samayam Telugu 29 May 2018, 5:38 pm
ముంబైలోని ప్రముఖ రైల్వే స్టేషన్ ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌టీఎమ్)’ అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడింది. మంగళవారం (మే 29) మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో స్టేషన్లో నిలిపి ఉంచిన షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఓ బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన సమయంలో రైలు బోగీలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల కారణంగా రైల్వే స్టేషన్‌లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.
Samayam Telugu Solapur


ముంబైలో గత మూడు రోజుల్లో ఇది మూడో అగ్ని ప్రమాదం కావడం గమనార్హం. వరస అగ్ని ప్రమాదాలతో ముంబైవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. టెక్నిప్లెక్స్ భవంతిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మలాద్ ప్రాంతంలోని ఓ మిఠాయి షాపులోనూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.