యాప్నగరం

ఎయిరిండియా విమానంలో వ్యక్తి మృతి.. కరోనా అలజడి

Vande Bharat Mission: వందే భారత్ మిషన్‌లో భాగంగా స్వదేశానికి వస్తున్న ఓ ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో మృతి చెందాడు. చలి జ్వరం, ఊపిరి ఆడకపోవడం వల్ల మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Samayam Telugu 14 Jun 2020, 8:33 pm
యిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు (42) మృతి చెందడం అలజడి రేపింది. కరోనా కారణంగా మరణించాడేమోనని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిరిండియా విమానంలో శనివారం (జూన్ 13) అతడిని స్వదేశానికి తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చలిజ్వరంతోనే బాధపడుతున్న బాధితుడు ఊపిరి అందక మరణించినట్లు ఎయిరిండియా సిబ్బంది తెలిపారు. అయితే.. జ్వరంతో బాధపడుతున్న అతడిని ప్రయాణానికి ఎలా అనుమతించారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Samayam Telugu ఎయిరిండియా విమానం
Air India Flight


నైజీరియాలోని లాగోస్‌ నుంచి శనివారం రాత్రి 7 గంటలకు ఎయిరిండియాకు చెందిన ఏఐ 1906 విమానం బయల్దేరింది. ఉదయం 3.45 గంటలకు ముంబై చేరుకుంది. అయితే.. విమానంలో గాల్లో ఉన్న సమయంలోనే ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని.. విమానంలో ఉన్న వైద్యులు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత విమానాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేసినట్లు ఎయిరిండియా ప్రతినిధులు వెల్లడించారు. బాధితుడిది సహజ మరణమేనని ఎయిరిండియా సంస్థ స్పష్టం చేసింది. ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపింది. అయితే.. ఈ ఘటన నేపథ్యంలో విమానాశ్రయాల్లో చేపట్టే తనిఖీలు, థర్మల్‌ స్క్రీనింగ్‌ ప్రక్రియల పట్ల ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.