యాప్నగరం

హ్యాట్సాఫ్.. 36 ఏళ్ల సర్వీసులో 165 మిస్సింగ్ కేసులు ఛేదించిన ఏఎస్సై

తన సర్వీసులో వందల మిస్సింగ్ కేసులను ఛేదించిన ఓ ఏఎస్సై.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మరో రెండు నెలల్లో రిటైర్‌ అవుతోన్న ఆయన.. ఇటీవల ఓ 16 ఏళ్ల బాలిక తప్పిపోతే.. ఫోన్ కూడా ఆ బాలిక వాడకపోయినా చాకచక్యంగా వ్యవహరించారు. చివరకు గుజరాత్‌లోని సూరత్‌లో ఆమెను గుర్తించారు. ఆయనే ముంబయి మతూంగా పోలీస్ స్టేషన్‌‌లో ఏఎస్సై‌గా బాబూరావు కృష్ణకాంబే. ఆర్ఏకే స్టేషన్‌లో తొలి కేసు గురించి కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 17 Apr 2023, 10:24 am

ప్రధానాంశాలు:

  • అంకితభావానికి మారుపేరుగా నిలిచిన పోలీస్
  • వారం రోజుల్లోనే 16 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసు కొలిక్కి
  • 36 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో విజయాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mumbai ASI
తన 36 ఏళ్ల సర్వీసులో 165 మిస్సింగ్ కేసులను ఛేదించిన ఓ ఏఎస్సై.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మరో రెండు నెలల్లో రిటైర్‌ అవుతోన్న ఆయన.. ఇటీవల ఓ 16 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసును వారం రోజుల్లో ఛేదించారు. ఆయనే ముంబయి మతూంగా పోలీస్ స్టేషన్‌‌లో ఏఎస్సై‌గా బాబూరావు కృష్ణకాంబే. ఇటీవల తమ కూతురు తప్పిపోయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా.. బాబూరావు వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేశారు. ఆ బాలిక మొబైల్‌ ఫోను కూడా వాడకపోవడంతో ఆమె ఎక్కడుందో కనిపెట్టడం కాంబేకి కత్తి మీద సాములా మారింది.
కానీ, ఈ విషయంలో ఏఎస్సై బాబూరావు వెనకడుగు వేయలేదు. బాలిక బంధువులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించారు. గుజరాత్‌లోని ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఉన్నట్టు తెలిసింది. అతడి కోసం తల్లిదండ్రులను వదిలిపెట్టి.. సూరత్‌లోని దూరపు బంధువుల ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. అధికారుల ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లిన కాంబే బాలికను తీసుకొచ్చి, కౌన్సెలింగ్ తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా ఒకటీ, రెండు కాదు.. తన 36 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో కేసులను విజయవంతంగా ఛేదించిన అనుభవం గడించారు.

దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారైనా తప్పిపోయిన పిల్లలను తిరిగి వాళ్ల తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ సమయంలో తల్లిదండ్రుల కళ్లలో కనిపించే ఆనందమే వేరని అంటారు కాంబే. తన మొదటి కేసు కిద్వాయ్ మార్గ్‌లో తప్పిపోయిన పిల్లవాడి గురించి ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పటికి ఆర్ఏకే మార్గ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించారు. నెలల తరబడి శోధించిన తర్వాత భివాండిలోని ఓ అనాథాశ్రమంలో ఉన్నట్టు గుర్తించారు. “ఆ రోజు వర్షం కురుస్తోంది.. మేము బిడ్డను తల్లి వద్దకు తీసుకువచ్చాం.. కాని వారు ఒకరినొకరు గుర్తించలేదు. తల్లి గొంతు విన్న తర్వాత, పిల్లవాడు నా చేతుల నుంచి దిగి ఆమె వద్దకు వెళ్లి కౌగిలించుకున్నాడు’ అని అతను నాటి సంఘటనను వివరించారు.

‘కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో మాతుంగా పోలీస్ స్టేషన్ వద్ద ఓ 10 ఏళ్ల బాలుడు తన కంటపడగా.. అతనితో మాట్లాడిన తర్వాత మైసూరుకు చెందినవాడని తెలిసింది. బాలుడ్ని తీసుకుని బెంగుళూరుకు రైలులో అక్కడ నుంచి మైసూర్‌కు కారులో వెళ్లాను.. చిన్నారిని చూడగానే బాలుడి తల్లిదండ్రులు నాకు కన్నీటితో కృతజ్ఞతలు చెప్పారు.. వారికి నోట మాట రాలేదు’ కాంబే అన్నారు.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.