యాప్నగరం

Vande Bharat Express: మరో గుడ్‌న్యూస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో గోవా ట్రిప్!

Vande Bharat Express: గోవా వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ.. కొందరికి ఎలా వెళ్లాలో తెలియదు. ఫ్లైట్ ఎక్కడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గోవాకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా ట్రయల్ రన్ పూర్తి చేశారు. అతి త్వరలోనే ముంబై నుంచి గోవాకు ఈ ట్రైన్‌ను నడపనున్నారు. దీనిపై రైల్వే మంత్రి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 16 May 2023, 7:09 pm

ప్రధానాంశాలు:

  • గోవా లవర్స్‌కు రైల్వే శాఖ గుడ్ న్యూస్
  • గోవాకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసు
  • త్వరలో ప్రారంభించనున్న ప్రధాని
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vande Bharat Express
వందే భారత్ ఎక్స్‌ప్రెస్
Vande Bharat Express: భారతీయ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ముంబై నుంచి గోవా వరకు నడిచే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కాబోతోంది. ముంబై -గోవా (Mumbai to Goa) మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ మంగళవారం జరిగింది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ కోసం.. ఉదయం ముంబై నుంచి బయలుదేరింది. ట్రయల్‌ పాస్‌ అయిన తర్వాత ముంబై- గోవా మార్గంలో రైలు నడపనున్నారు. ఈ మార్గంలో నడపనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ముంబై నుంచి నాల్గో రైలు కానుంది. ఇప్పటి వరకు ముంబై- గాంధీనగర్, ముంబై- షిర్డీ, ముంబై- సోలాపూర్ రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

ముంబై- గోవా మార్గంలో త్వరలో వందే భారత్ సెమీ-హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నట్లు.. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే వెల్లడించారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేల ప్రతినిధి బృందానికి ఈ విషయాన్ని చెప్పారు. ముంబై- గోవా విద్యుద్దీకరణ పూర్తయిందని.. దీని తనిఖీ తర్వాత వందే భారత్ సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు.
వందే భారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టగలదు. ఆటోమేటిక్ డోర్లు, ఆన్‌బోర్డ్ వైఫై, బయో- వాక్యూమ్ టాయిలెట్లు, జీపీఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ, మెరుగైన నిర్వహణతో ఈ రైలు పరుగులు పెడుతోంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా వందే భారత్ రైలులో ఉంటుంది.

వందే భారత్ రైళ్ల సగటు వేగం.. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. భారతీయ రైల్వే నిర్వహించే ఎలక్ట్రిక్ మల్టీ- యూనిట్ రైలు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ దీన్ని రూపొందించింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.