యాప్నగరం

ఆ ఉద్యమ సమయంలో అత్యాచారాలు నిజం

ఆ ఉద్యమ సమయంలో అత్యాచారాలు నిజంఆ ఉద్యమ సమయంలో అత్యాచారాలు నిజం

Samayam Telugu 20 Jan 2017, 10:49 am
2016 ఫిబ్రవరిలో ప్రత్యేక కోటా కోసం జాట్లు చేసిన ఆందోళనలో మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగినట్లు పంజాబ్-హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది.
Samayam Telugu murthal mass rapes did happen hc says arrested rapists
ఆ ఉద్యమ సమయంలో అత్యాచారాలు నిజం

ముర్తల్ అనే ప్రాంతంలో జాట్లు ఆందోళన చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న మహిళలపై ఆందోళనకారులు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డడారని అప్పట్లో మీడియా కథనాలు ప్రచురింది. ఈ సంఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించగా..హర్యానా పోలీసులు ఎఫ్ఆర్ఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారించారు. అయితే అత్యాచారం జరిగిందన్న ప్రాంతంలో లభించిన మహిళల లోదుస్తులు, రక్తపు మరకలు...పోలీసులు అరెస్టు చేసిన వారి వీర్య నమునాలతో సరిపోలలేవని వారిని విడుదల చేశారు.
అయితే ఆ కేసులో సాక్షులుగా ఉన్న వారిలో ఒక క్యాబ్ డ్రైవర్..మహిళలను ఆందోళనకారులు లాక్కెళ్లుతుండగా చూశానని హైకోర్టుకు తెలిపారు.

ఈ కేసుపై గురువారం హైకోర్టు బహిరంగ విచారణ జరిపింది.
దీనిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కూడా ఏర్పాటయ్యింది.

‘‘జాట్ల ఆందోళన సందర్భంగా సామూహిక అత్యాచారాలు జరిగింది నిజం...అత్యాచార బాధితులు, అత్యాచార బాధ్యులను గుర్తించి అరెస్టు చేయండి’’ అని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. అటు ఈ కేసును విచారించి నిజానిజాలు తేల్చేందుకు తోడ్పాటును అందించాలని సీబీఐని కోరింది. అటు ‘సిట్’ నిందితులపై గుర్తించేందుకు విచారణ సాగుతోందని చెప్పింది.

తదుపరి విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.