యాప్నగరం

ఉగ్రదాడికి నిరసనగా గళమెత్తిన ముస్లింలు..

జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ముష్కర మూకరులు అమర్‌నాథ్ యాత్రికులపై ఒక్కసారిగా విరుచుకుపడి ఏడుగురి ప్రాణాలను బలిగొన్న

TNN 11 Jul 2017, 2:19 pm
జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ముష్కర మూకరులు అమర్‌నాథ్ యాత్రికులపై ఒక్కసారిగా విరుచుకుపడి ఏడుగురి ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఉగ్రవాద దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా పలు వర్గాలు ఆందోళన చేపట్టాయి. జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయని, ఆ రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షాలు గళమెత్తాయి. మరోవైపు సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అహ్మదాబాద్‌లో పెద్ద సంఖ్యలో ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు తరలి వచ్చి ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు.
Samayam Telugu muslims protest against terror attack on amarnath pilgrims
ఉగ్రదాడికి నిరసనగా గళమెత్తిన ముస్లింలు..


మరోవైపు ఈ ఉగ్రవాద దాడికి పాల్పడింది లష్కరే తోయిబా అని, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది ఇస్మాయిల్.. దీనికి పథక రచన చేశాడని జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. సెక్యూరిటీ కాన్వాయ్ అనుసరించకుండా ఒంటరిగా వెళుతోన్న బస్సును లక్ష్యంగా చేసుకొని ముష్కరులు దాడికి తెగబడ్డారని వారు తెలిపారు. దాడికి గురైన బస్సు అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి సరైన అనుమతులు తీసుకోలేదని, నిషేధిత సమయంలో యాత్రికులను తీసుకొని బయలుదేరిందని పోలీసులు వెల్లడించారు.

పిరికిపందల చర్యకు బెదిరేది లేదనే సందేశం ఇస్తూ.. వందల మందితో కూడిన మరో బ్యాచ్ తాజాగా అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరింది. భారీ భద్రత మధ్య ‘బం బం భోలే..’ అంటూ వారు ముందుకు సాగుతున్నారు.

ఈ ఉగ్రదాడిలో గాయపడిన వారిని, ఇతర యాత్రికులను.. ఇండియన్ ఆర్మీకి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సూరత్ విమానాశ్రయానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూరత్ విమానాశ్రయం వద్ద ఆంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.