యాప్నగరం

కావాలనే నా ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆలస్యం చేస్తున్నారు -శశికళ

తమిళనాట రాజకీయ పరిణామాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఎప్పుడు, ఎటువంటి పరిణామం..

TNN 9 Feb 2017, 8:55 am
తమిళనాట రాజకీయ పరిణామాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఎప్పుడు, ఎటువంటి పరిణామం చోటుచేసుకుంటుందా ? కేర్ టేకర్ సీఎం పన్నీర్ సెల్వం, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఇద్దరిలో సీఎం అయ్యే అవకాశం ఎవరిని వరిస్తుందా అని తమిళతంబీలే కాకుండా అన్ని ప్రాంతాలవారు అక్కడ జరుగుతున్న నాటకీయ పరిణామాలని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలావుంటే, ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ తన ప్రమాణస్వీకారోత్సవానికి రావడానికి ఆలస్యం చేస్తున్నారని తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుపై ఆరోపణలు చేశారు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధంగా వున్న వీకే శశికళ.
Samayam Telugu my swearing in as cm was being intensionally delayed by the governor sasikala
కావాలనే నా ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆలస్యం చేస్తున్నారు -శశికళ


ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకి చేరుకోనున్నారు. అయితే, గవర్నర్ ఆలస్యం చేస్తుండంపై అసంతృప్తితో వున్న కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని ఇవాళ ఢిల్లీ వెళ్లి ఆయన్ని కలిసేందుకు సిద్ధమయ్యారు. కానీ గవర్నర్ గురువారం మధ్యాహ్నానికి చెన్నైకి వస్తున్నారనే సమాచారం అందడంతో వాళ్లు తమ ఆలోచనను విరమించుకున్నారు.

" నా పక్కనే కూర్చుని నన్ను శాసనసభా పక్ష నేతగా ప్రకటించిన పన్నీర్ సెల్వం 48 గంటలు తిరిగేలోగా మాట మార్చారంటే, ఆ మధ్య వ్యవధిలో ఏం జరిగింది ? పన్నీర్ సెల్వం ఎందుకు మనసు మార్చుకున్నట్టు ? ఇప్పుడు లేనిపోని అబద్దాలు చెబుతూ ఆరోపణలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి" అని ప్రశ్నించారు శశికళ. ఈ మొత్తం వ్యవహారం ఎలా వున్నా.. గురువారం చోటుచేసుకోనున్న బలాబలాల పరీక్షపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైవుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.