యాప్నగరం

2 దేశాల మేలు కోసమే అమెరికా పర్యటన: మోడీ

అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపర్చుకోవడమే లక్ష్యంగా తాను అమెరికాలో పర్యటనకి..

ET Online 23 Jun 2017, 9:39 pm
అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపర్చుకోవడమే లక్ష్యంగా తాను అమెరికాలో పర్యటనకి వెళ్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమెరికా-భారత్ మధ్య సత్సంబంధాలు కలిగి వుంటే, అది మన రెండు దేశాలకి మేలు చేకూర్చడమేకాకుండా ప్రపంచానికి సైతం ప్రయోజనం చేకూరుస్తుంది అని మోదీ పేర్కొన్నారు. రేపు శనివారం ఢిల్లీ నుంచి అమెరికా పర్యటనకి బయలుదేరి వెళ్లనున్న నేపథ్యంలో ఈరోజు ఓ ట్వీట్ చేస్తూ అందులో ఇలా తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు మోదీ.
Samayam Telugu my usa visit is aimed at deepening ties between our nations modi
2 దేశాల మేలు కోసమే అమెరికా పర్యటన: మోడీ


నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మొదట అమెరికా వెళ్లనున్న మోదీ అక్కడ అమెరికా సంస్థల సీఈఓలతో భేటీ కానున్నారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టుని వారికి వివరించి భారత్‌కి విదేశీ పెట్టుబడులు రప్పించడమే ఈ భేటీ వెనుకున్న లక్ష్యం. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకానున్నారు. ఓవైపు పాకిస్థాన్‌తో మరోవైపు చైనాతో పలు వివాదాలు ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో మోడీ ట్రంప్‌తో భేటీ అవనుండటం ప్రాధాన్యతని సంతరించుకుంది. అమెరికా పర్యటన అనంతరం పోర్చుగల్, నెదర్లాండ్స్ దేశాల్లోనూ పర్యటించనున్నారు మోదీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.