యాప్నగరం

రేప్, హత్య కేసులో 19 ఏళ్ల యువకుడికి మరణ శిక్ష

బాలిక క్లాస్‌మేట్, కజిన్.. ఆమెకు మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ జాకీర్ అనే యువకుడితో కలిసి రేప్ చేశారు. ఆ తర్వాత ఆమెను కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు.

Samayam Telugu 7 Sep 2018, 6:08 pm
11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య ఘటనలో ప్రధాన నిందితుడైన యువకుడికి కోర్టు మరణ శిక్ష విధించింది. మార్చి 23న అస్సాంలోని నాగావ్‌లో నిందితుడు జాకీర్ హుస్సేన్ (19)తో పాటు బాధితురాలి క్లాస్‌మేట్ (12), ఆమెకు సోదర వరసైన 11 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడమే కాకుండా కిరోసిన్ పోసి హత్య చేశారు.
Samayam Telugu 12a


శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా సెషన్స్ న్యాయమూర్తి రితా కర్.. జాకీర్‌కు మరణ శిక్ష విధించడంతో పాటు మిగతా నిందితులిద్దరిని బాల నేరస్తులుగా పరిగణిస్తూ మూడేళ్ల పాటు జువెనైల్ హోమ్‌కు తరలించాలని ఆదేశించారు. ఐదో తరగతి చదువుతున్న బాధితురాలిపై అత్యాచారం, హత్య ఘటన అస్సాంలో ఆందోళనలకు దారితీసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండు చేశారు.

ఈ తీర్పుపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘‘గత ఐదు నెలల 16 రోజులుగా ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియలేదు. ఈ రోజు తీర్పు వినగానే సంతోషం కలిగింది. ఈ కేసులో ప్రధాన దోషిగా తేలిన జాకీర్ హుస్సేన్‌కు వెంటనే ఉరివేయాలి. మా కుమార్తెపై ఈ దారుణం చోటు చేసుకున్న తర్వాత నా భార్య అఛేతన స్థితికి చేరుకుంది. ఇప్పటికీ ఆమె కోలుకోలేదు’’ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.