యాప్నగరం

నమస్తే పెట్టి మరీ దోచుకునే దొంగల బ్యాచ్ అరెస్ట్

రోడ్డుపైన వెళ్తోంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎంతో తెలిసిన వాళ్లలాగా ఫోజిస్తూ పెట్టే నమస్తేలకి పడిపోతున్నారా ?..

TNN 24 Feb 2017, 10:12 pm
రోడ్డుపైన వెళ్తోంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎంతో తెలిసిన వాళ్లలాగా ఫోజిస్తూ పెట్టే నమస్తేలకి పడిపోతున్నారా ? అయితే, ఇకపై కొంచెం జాగ్రత్త పడాల్సిందే అనుకుంటారు ఈ వార్త చదివాక. అవును, దోపిడీలో ఈ నలుగురు దొంగల స్టైలే వేరు. వయసైపోయిన ఒంటరి వృద్ధులనే తమ లక్ష్యంగా ఎంచుకోవడం ఈ బ్యాచ్ కున్న ప్రత్యేకత.
Samayam Telugu namaste gang 4 thieves held for robbing sr citizens
నమస్తే పెట్టి మరీ దోచుకునే దొంగల బ్యాచ్ అరెస్ట్


దారిలో వెళ్లేవారిని ఏదో తమకి బాగా తెలిసినవారిలా నమస్తే పెట్టి మరీ ఆపుతారు. కార్లలో వెళ్లేవారిని సైతం ఆ కారు పక్కనే తమ వాహనాన్ని పోనిచ్చి మరీ కారుని ఆపుతారు. తిరిగి వారికి నమస్తే పెట్టడం కోసం ఆగిన ఆ అవతలివారిని మాటల్లో పడేస్తారు. ఇంతలోనే మిగతా దొంగలు సీన్‌లోకి ఎంటరై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ పెట్టి బ్లాక్ మెయిలింగ్‌కి దిగుతారు. ఉన్నదంతా ఇచ్చుకోకపోతే ప్రాణం తీస్తామని బెదిరిస్తారు. దీంతో తమ తమ దగ్గరున్నదంతా ఆ దొంగలకి అప్పగించి వెళ్లాల్సిన దుస్థితి.

ఇలా దాదాపు 60 మందిని దోచుకుందీ దొంగల బ్యాచ్. ఇదే తరహాలో దోపిడీకి గురయ్యామని 60 మంది వరకు బాధితులు ఢిల్లీ పోలీసులని ఆశ్రయించారు. దాదాపు చాలా ఘటనల్లో సీసీటీవీ సాక్ష్యాలు లభించాయి. ఇలా వృద్ధులని దోచుకున్న సొమ్ముతో ఆడి లాంటి ఖరీదైన కార్లు కొనడమేకాకుండా ఖరీదైన ఫ్లాట్లు కూడా కొనుగోలు చేసిన ఈ ముఠా నిన్న ఢిల్లీ పోలీసులకి పట్టుబడింది. నలుగురు సభ్యులున్న ఈ నమస్తే గ్యాంగ్ పట్టుబడటంతో వారి వద్ద లభించిన ప్రాపర్టీతో దాదాపు 50 కేసులు పరిష్కారం అయినట్టే అని చెబుతున్నారు ఢిల్లీ పోలీసులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.