ఐదేళ్ల పదవీ కాలంలో ప్రధాని మోదీ తొలిసారిగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి తెర పడటానికి గంట ముందు శుక్రవారం (మే 17) సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఐదేళ్ల కాలంలో ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నా.. అనేక అంశాలు లేవనెత్తినా, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసినా మీడియా సమావేశం నిర్వహించని మోదీ తొలిసారిగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. పేరుకే మీడియా సమావేశంలో పాల్గొన్న మోదీ.. జర్నలిస్టులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ బదులివ్వకపోవడం గమనార్హం. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను ప్రధాని మోదీ సున్నితంగా తోసిపుచ్చారు. బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించారనీ.. ప్రధాని హోదాలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని మోదీ వివరించారు.
‘భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకే పనిచేస్తారు. క్రమశిక్షణను పాటిస్తారు. పార్టీకి మేమంతా క్రమశిక్షణ గల కార్యకర్తలం’ అని మోదీ వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధ్యక్షుడి హోదాలో అమిత్ షా సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
మీడియాను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. పూర్తి మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పారు. ప్రపంచాన్ని శాసించే విధంగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. ఐదేళ్లు దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యం ఎంతో విలువైనదని, దీంతో ప్రపంచాన్నే మెప్పించామని పేర్కొన్నారు. తాను ప్రజల కోసమే ఆలోచిస్తున్నాని పునరుద్ఘాటించారు.
Also Read: పూర్తి మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తాం
‘భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకే పనిచేస్తారు. క్రమశిక్షణను పాటిస్తారు. పార్టీకి మేమంతా క్రమశిక్షణ గల కార్యకర్తలం’ అని మోదీ వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధ్యక్షుడి హోదాలో అమిత్ షా సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
మీడియాను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. పూర్తి మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పారు. ప్రపంచాన్ని శాసించే విధంగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. ఐదేళ్లు దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యం ఎంతో విలువైనదని, దీంతో ప్రపంచాన్నే మెప్పించామని పేర్కొన్నారు. తాను ప్రజల కోసమే ఆలోచిస్తున్నాని పునరుద్ఘాటించారు.
Also Read: పూర్తి మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తాం