యాప్నగరం

కలిసిన మనసులు: మోదీ, నితీష్‌ల ముచ్చట్లు

పాత స్నేహితులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ లు మళ్లీ కలిసి పోయారు. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించారు.

TNN 6 Jan 2017, 9:40 am
పాత స్నేహితులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ లు మళ్లీ కలిసి పోయారు. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. గురువారం పాట్నాలో జరిగిన సిక్కుల పదో గురువు గురు గోవింద్‌సింగ్ 350వ జయంతి వేడుకలకు పీఎం మోదీ, సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, పంజా బ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు రామ్‌విలాస్ పాశ్వాన్, రవిశంకర్‌ప్రసాద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Samayam Telugu narendra modi nitish kumar are all praise for each other
కలిసిన మనసులు: మోదీ, నితీష్‌ల ముచ్చట్లు


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ బీహార్‌లో నితీశ్ పాలన దేశానికే ఆదర్శమన్నారు. మద్య నిషేధాన్ని కఠినంగా అమలుచేయడం సాధారణమైన విషయం కాదన్నారు. ఆయన ప్రభుత్వానికి ఏకంగా ఏఏఏ (ట్రిపుల్) గ్రేడ్ మార్కులు ప్రకటించారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో మోదీని తీవ్రంగా వ్యతిరేకించిన నితీష్... ప్రధాని మోదీ ప్రకటించిన నోట్ల రద్దును స్వాగతించారు. నోట్లరద్దును తొలి విపక్షనేత నితీశ్ కావడంతో మోదీకి నైతిక బలం లభించింది.


అటు బీహార్ సీఎం నితీశ్ మాట్లాడుతూ నరేంద్రమోదీ సీఎంగా గుజరాత్‌లో విజయవంతంగా మద్యనిషేధం అమలుచేశారని కొనియాడారు.

సిక్కు సంప్రదాయబద్దంగా ప్రధాని, నితీశ్, లాలూ, కేంద్రమంత్రులు తలపాగా ధరించారు.

మోదీ, నితీష్ లు కలిసిపోవడం భవిష్యత్ రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయో ఆసక్తిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.