యాప్నగరం

Phone Blast: జేబులోనే పేలిపోయిన మొబైల్ ఫోన్.. షాకింగ్ వీడియో

Phone Blast: కేరళకు చెందిన ఓ చిన్నారి తన తల్లిదండ్రుల ఫోన్ తీసుకొని వీడియోలు చూస్తుండగా.. ఒక్కసారిగా పేలిపోయింది. చిన్నారి ముఖంపైనే ఫోన్ పేలిపోవడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. అలాగే, గతవారం ఓ యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ పేలి కాలిన గాయాలయ్యాయి. తాజాగా, ఒ 76 ఏళ్ల వృద్ధుడు హెటల్‌కు వెళ్లి... ఆర్డర్ ఇచ్చి కుర్చిలో కూర్చుని ఉండగా.. తన షర్టు జేబులోని ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 19 May 2023, 5:06 pm

ప్రధానాంశాలు:

  • టీ తాగడానికి హోటల్‌కు వెళ్లిన వృద్ధుడు
  • షర్టు జేబులో ఉన్న ఫోన్ పేలి మంటలు
  • నెల రోజుల వ్యవధిలో కేరళలో మూడో ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Phone Blast
ఓ 76 ఏళ్ల వ్యక్తి.. టీ తాగడం కోసం హోటల్‌కు వెళ్లాడు. అతడు కుర్చిలో కూర్చుని ఉండగా.. జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో జేబులోని నుంచి దానిని తీసి కిందపడేయగా.. అప్పటికే చొక్కాకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన బాధితుడు.. చేతులతో మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలోని త్రిసూర్‌ జిల్లాలో గురువారం చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన దృశ్యాలు హోటల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే త్రిసూర్‌ జిల్లాలోని మోరొట్టిచల్‌కు చెందిన ఏలియాస్ అనే 76 ఏళ్ల వృద్ధుడు స్థానికంగా ఉన్న ఓ హెటల్‌కు వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చి కుర్చిలో కూర్చుని ఉండగా.. తన షర్టు జేబులోని ఉన్న మొబైల్ ఫోన్ వేడెక్కడం గమనించాడు. బయటకు తీసేలోపే అది పేలిపోయి మంటలు చెలరేగాయి. హఠాత్పరిణామానికి షాకైన ఏలియాస్.. వెంటనే తేరుకున్నాడు. జేబులో నుంచి దానిని తీసి కింద పడేశాడు.కానీ, అప్పటికే చొక్కాకు అంటుకున్న మంటలను చేతులతో ఆర్పేశాడు. దీంతో అతడు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు.


గత నెల రోజుల్లో కేరళలో జరిగిన మూడో ఘటన ఇది. గతవారం ఓ యువకుడి ఫ్యాంటు జేబులో ఉన్న మొబైల్ పేలిపోయి మంటలు అంటుకోవడంతో అతడికి గాయాలయ్యాయి. అలాగే, ఏప్రిల్ 24న త్రిసూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి.. మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తుండగా పేలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 24న ఎనిమిదేళ్ల బాలిక ఆదిత్య శ్రీ, ఆమె నాయినమ్మ ఇద్దరే ఇంటిలో ఉండగా.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వీడియో చూస్తుండగా పేలుడు సంభవించింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. తలకు తీవ్ర గాయం కావడంతోనే పాప చనిపోయినట్టు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.