యాప్నగరం

నాసా చిత్రం: కేరళ.. వరదలకు ముందు ఆ తర్వాత!

దేవ భూమి కేరళను వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో 320 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Samayam Telugu 28 Aug 2018, 3:45 pm
దేవ భూమి కేరళను వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో 320 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టినా.. ఊళ్లలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకుంది. తాజాగా నాసా విడుదల చేసిన చిత్రాలు చూస్తే కేరళలో వరద ఏ స్థాయిలో ముంచెత్తిందో అర్థమవుతుంది.
Samayam Telugu Untitled

నాసా విడుదల చేసిన ఈ చిత్రాల్లో వరదలకు ముందు, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇందులో మొదటి శాటిలైట్ చిత్రాన్ని 2018, ఫిబ్రవరి 6న తీశారు. రెండో శాటిలైట్ చిత్రాన్ని ఆగస్టు 22న తీశారు. ఈ చిత్రంలో ముదురు నీలం రంగులో కనిపిస్తున్నది వరద నీరని నాసా పేర్కొంది.
కే
రళలో ఉన్న నదులన్నీ ఉప్పొంగి తీర ప్రాంతాలను ముంచెత్తాయని, కరువన్నూర్ నది సుమారు 40 గ్రామాలను ముంచెత్తిందని పేర్కొంది. రెండు జాతీయ రహదారులు సుమారు 2.2 కిమీల దూరం వరకు దెబ్బతిన్నాయని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.