జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో తీవ్రవాదుల దాడుల్లో మరణించిన అమరవీరుడు ప్రమోద్ కుమార్ అంత్యక్రియలు ఆయన స్వరాష్ట్రంలో ఘనంగా జరిగాయి. ఆగస్టు 15నాడు యావత్ దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. దేశానికి మకుటాయమాన రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకలను భగ్నం చేసేందుకు షరామామూలుగా పాకిస్థాన్ తీవ్రవాదులు కుట్రపన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మరికొద్ది గంటల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారనగా వారు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పెరేడ్లో ఉన్న సీఆర్పీఎఫ్ కమాండెంట్లపై దాడి చేశారు. ఈ దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ ప్రమోద్ కుమార్ కూడా మరణించారు. జార్కండ్ కు చెందిన ప్రమోద్ చిన్ననాటినుండి సైన్యంలో చేరి దేశానికి సేవలందించాలని ఎంతగానో తపనపడేవారు. ప్రమోద్ కుమార్ మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మంగళవారం నాడు సైనిక లాంచనాల మధ్య ఆయన అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు.
అమరవీరుడా అందుకో సలాములు
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో తీవ్రవాదుల దాడుల్లో మరణించిన అమరవీరుడు ప్రమోద్ కుమార్ అంత్యక్రియలు ఆయన స్వస్థలంలో ఘనంగా జరిగాయి.
TNN 16 Aug 2016, 7:04 pm