యాప్నగరం

జాతీయస్థాయి పోటీలకు వెళ్తుండగా ప్రమాదం.. నలుగురు యువ ఆటగాళ్లు మృతి

జాతీయస్థాయి పోటీలకు వెళ్తున్న యువ క్రీడాకారులను మృత్యుదేవత వెంబడించింది. వారు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురికావడంతో తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 14 Oct 2019, 11:32 am
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు జాతీయస్థాయి హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆటగాళ్లు గాయపడ్డారు. ఇటార్సీలో జరుగుతోన్న ధ్యాన్ చంద్ ట్రోఫీ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ముగ్గుర్నీ సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిజేస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 69వ జాతీయ రహదారిపై రైసల్‌పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Samayam Telugu accident


ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపట్టారు. నాలుగు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. స్థానిక పోలీసుల సాయంతో మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వేగంగా వాహనం నడపటంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో మొత్తం ఏడుగురు వాహనంలో ఉన్నట్టు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.