యాప్నగరం

Mock Drill కోవిడ్ సన్నద్ధతపై నేడు, రేపు దేశవ్యాప్త మాక్ డ్రిల్

గత కొన్ని రోజులుగా దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి తప్పనిసరి మాస్క్ సహా కరోనా నిబంధనలు అమలుకు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర సంసిద్ధతను సమీక్షించేలా కేంద్రం రెండు రోజుల మాక్ డ్రిల్ చేపట్టింది. కొత్త వేరియంట్‌లతో సంబంధం లేకుండా ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనల పాటించడం’ అనే ఐదెంచల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 10 Apr 2023, 10:02 am

ప్రధానాంశాలు:

  • దేశవ్యాప్తంగా మరోసారి పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
  • రెండు రోజుల మాక్ డ్రిల్ చేపట్టిన కేంద్ర ఆరోగ్య శాఖ
  • కేసుల వెనుక ఒమిక్రాన్ సబ్-వేరియంట్ ఎక్స్‌బీబీ1.16
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mock Drill
మరోసారి కరోనా వైరస్ కేసుల పెరుగుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సోమ, మంగళవారాల్లో కోవిడ్ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర సంసిద్ధతను సమీక్షించడానికి ఈ డ్రిల్ చేపట్టారు. హరియాణా ఝజ్జర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో మాక్ డ్రిల్స్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయా పర్యవేక్షించనున్నారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు అప్రమత్తంగా ఉండాలని, తమ తమ రాష్ట్రాలలో ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను తనిఖీ చేయాలని కేంద్ర మంత్రి కోరారు.
కొత్త వేరియంట్‌లతో సంబంధం లేకుండా ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనల పాటించడం’ అనే ఐదెంచల వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లు అమలులో ఉన్నాయని, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని ఆయన అన్నారు.

కోవిడ్ నాలుగో వేవ్‌కు అవకాశం ఉంది కాబట్టిప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. మూడో వేవ్‌లో ఓమిక్రాన్ BF.7 సబ్-వేరియంట్, ఇప్పుడు XBB1.16 సబ్-వేరియంట్‌లు కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అయితే, ఉప-వేరియంట్‌లు అంత ప్రమాదకరమైనవి కాదని ఆయన అన్నారు. దేశంలోని చాలా చోట్ల కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి తప్పనిసరి మాస్క్ సహా కరోనా నిబంధనలు అమలు చేస్తున్నాయి. హరియాణా, కేరళ, ఢిల్లీ, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు మాస్క్ నిబంధనలు మళ్లీ అమల్లోకి తీసుకొచ్చాయి.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.