యాప్నగరం

కాంగ్రెస్‌లోకి సిద్ధూ దంపతులు, ముహుర్తం రెడీ

మాజీ క్రికెటర్, ఆవాజ్-ఇ-పంజాబ్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచార చేస్తారని ఆపార్టీ పంజాబ్ చీఫ్ కెప్టెన్ అమరిందర్ సింగ్ తెలిపారు.

Samayam Telugu 24 Nov 2016, 3:44 pm
మాజీ క్రికెటర్, ఆవాజ్-ఇ-పంజాబ్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచార చేస్తారని ఆపార్టీ పంజాబ్ చీఫ్ కెప్టెన్ అమరిందర్ సింగ్ తెలిపారు.
Samayam Telugu navjot singh sidhu will campaign for congress
కాంగ్రెస్‌లోకి సిద్ధూ దంపతులు, ముహుర్తం రెడీ


‘సిద్ధు, ఆయన సతీమణి మాతోనే ఉన్నారు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయకూడదని అనుకుంటున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేస్తారు’ అని అమరిందర్ సింగ్ చెప్పారు.

సిద్ధు సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధు, అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ నవంబర్ 28న కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు అమరిందర్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత సిద్ధు కూడా కాంగ్రెస్ లో లాంఛనంగా చేరతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేజిక్కుంటే అమృత్ సర్ నుంచి సిద్ధును పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ నుంచి బయటికొచ్చిన సిద్ధు అవాజ్ ఇ పంజాబ్ అనే పొలిటికల్ ఫ్రంట్ ప్రారంభించారు. ఆయనతో బియన్స్ బ్రదర్స్ కూడా జతకలిశారు. ఆ ఫ్రంట్ ప్రారంభమైన కొద్ది రోజులకే దాన్ని అటకెక్కించారు. ప్రజల్లో ఆ ఫ్రంట్ కు సరైన్ ఆదరణ లేకపోవడం...ఫ్రంట్ నేతల మధ్య ఇగో ఇష్యూస్ వల్ల సిద్ధు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు.

అయితే ఫ్రంట్ ప్రారంభ సమయంలో సిద్ధు దంపతులు కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. పంజాబ్ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామని అన్ని పార్టీలకు దూరంగా ఉంటామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.