యాప్నగరం

ఉగ్రసమాచారం: ముంబైలో నేవీ హై అలర్ట్

ఉగ్రవాదులు సంచారిస్తున్నారన్న సమాచారంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు.

TNN 22 Sep 2016, 4:26 pm
ఉగ్రవాదులు సంచారిస్తున్నారన్న సమాచారంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. ముంబై సముద్రతీర సమీపంలోని ఉరాన్ లో ఉన్న నేవీ సిబ్బంది ఆయుధగారం వద్ద ఇద్దరు ముగ్గురు నల్లముసుగులు ధరించినవారు ఆయుధాలతో తిరుగుతున్నారని స్కూలు పిల్లలు ఇచ్చిన సమాచారంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. మెరైన్ కమాండోలు మార్కోస్ కూడా రంగంలోకి దిగి ఉరాన్ పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు ముంబై పోలీసులు కూడా నాఖాబంధీ నిర్వహిస్తూ అనుమానం వచ్చినవారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ముంబై తీరం గుండా ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తలు అవాస్తవమని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. స్కూలు పిల్లలు ఇచ్చిన సమాచారం మేరకు నిఘా, తనిఖీలు మాత్రం కొనసాగుతాయని పేర్కొన్నాయి.
Samayam Telugu navy on high alert in mumbai
ఉగ్రసమాచారం: ముంబైలో నేవీ హై అలర్ట్


On the information of suspected men entered the Uran where navy ammunition depot INS Abhimanyu located opposite Mumbai harbour Navy deployed its commandos.
More details are awaited

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.