యాప్నగరం

రూ.3 వేల కోట్ల డ్రగ్స్.. కేరళ తీరంలో కలకలం

కేరళ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. గస్తీకి వెళ్లిన భారత నౌకాదళానికి చేపల బోటు అనుమానాస్పదంగా కనిపించింది. బోటులో సోదాలు చేయడంతో భారీ స్థాయిలో మత్తుపదార్థాలు లభ్యమయ్యాయి.

Samayam Telugu 19 Apr 2021, 9:47 pm
కేరళను కుదిపేసిన బంగారం స్మగ్లింగ్‌ను మరువక ముందే మరో భారీ స్మగ్లింగ్ షాక్‌కి గురిచేస్తోంది. వందల కేజీల డ్రగ్స్ పట్టుబడడం సంచలనంగా మారింది. ఏకంగా 300 కిలోల డ్రగ్స్‌ను నేవీ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ తీరం అరేబియా సముద్రంలో భారత నౌక సువర్ణ గస్తీలో ఉండగా ఓ చేపల బోటు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించింది.
Samayam Telugu స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, నిందితులు
drugs


వెంటనే ఇండియన్ నేవీ సిబ్బంది చేపల బోటును నిలువరించి సోదాలు జరపడంతో భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద ప్యాక్ చేసి ఉంచిన సుమారు 300 కిలోల డ్రగ్స్ లభ్యమయ్యాయి. వాటి విలువ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో కేరళ తీరంలో డ్రగ్స్ బయటపడడం ఇదే తొలిసారని నేవీ అధికారులు చెబుతున్నారు. బోటుతో సహా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.