యాప్నగరం

భారత నయాగారా పరవళ్లు.. కనువిందు చేస్తున్న కర్ణాటక జలపాతం

భారతదేశ నయాగారగా ప్రసిద్ధి పొందిన గోకాక్ జలపాతం కనువిందు చేస్తోంది. ఘటప్రభ నదికి వరద ప్రవాహం పెరగడంతో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.

Samayam Telugu 6 Aug 2019, 9:04 pm
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రకృతి పరవశిస్తోంది. సరికొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఘటప్రభ నది పొంగి పొర్లుతోంది. దీంతో గోకాక్ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దేశంలో ప్రసిద్ధమైన ఈ వాటర్ ఫాల్స్‌కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. భారతదేశ నయాగారగా ఈ జలపాతానికి గుర్తింపు ఉంది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో గోకాక్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.

కర్ణాటకలో కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని నదులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వానలతో కృష్ణా నదిలోకి జల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం డ్యామ్‌లో నీటి నిల్వ అంతకంతకూ పెరుగుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.