యాప్నగరం

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం కీలకమైన నిర్ణయం

CAA 2019 పై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న సంగతి తెలిసిందే. కొందరు బీజేపీ నాయకుల్లోనూ అసహనం ఉన్నా, చాలా మంది బయటపడడం లేదు. తొలిసారిగా పశ్చిమ్ బెంగాల్ బీజేపీ నాయకుడి నుంచి నిరసన గళం వినిపించింది.

Samayam Telugu 24 Dec 2019, 4:14 pm
దేశంలో తాజాగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం హోంమంత్రిత్వశాఖ ప్రత్యేక ఈ మెయిల్‌ను రూపొందించింది. ప్రజలతోపాటు ఎంపీలు, ప్రముఖుల నుంచి ఈ అభిప్రాయాలు సేకరించనున్నారు.
Samayam Telugu CAA 2019


Also Read: శిశువు అపహరణ, చితక్కొట్టిన స్థానికులు.. కానీ, అతడు కన్నతండ్రే!

‘‘జాతీయ పౌరసత్వ చట్టాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు..? భారతీయ పౌరులపై ఇది ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారా? సీఏఏపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ బిల్లుతో లక్షిత మూడు దేశాల్లోని (పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్) మైనార్టీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? సీఏఏపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, హింసాత్మక ఘటనలపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ చట్టం దేశానికి నష్టం కలిగిస్తుందని అనుకుంటున్నారా’’ వంటి రకరకాల ప్రశ్నలు వేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రజలు తమ అభిప్రాయాలను నిర్దేశిత ఈ-మెయిల్‌‌కు పంపాలని కోరింది.

Also Read: ఇద్దరబ్బాయిల పెళ్లి.. న్యాయం కోసం పోరాడుతున్న ఆమె (అతడు)..

మరోవైపు, సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న సంగతి తెలిసిందే. కొందరు బీజేపీ నాయకుల్లోనూ అసహనం ఉన్నా, చాలా మంది బయటపడడం లేదు. అయితే, తొలిసారిగా పశ్చిమ్ బెంగాల్ బీజేపీ నాయకుడి నుంచి నిరసన గళం వినిపించింది. ఈయనెవరో కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు.. బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్. బిల్లుకు మద్దతుగా కోల్‌కతాలో జేపీ నడ్డా ర్యాలీ నిర్వహించిన కొద్ది సేపటికే చంద్రకుమార్ తన నిరసన వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: మెట్రో రైలు టిక్కెట్ల కొనుగోలులో కొత్త విధానం.. ఇక సులభంగా..

అయితే, బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెల్లువెత్తుతున్న వ్యతిరేకతే కారణంగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధికారం కోల్పోవడం, గతంలోనూ కొన్ని రాష్ట్రాల్లో నష్టం జరగడం కూడా కొన్ని కారణాలుగా చెబుతున్నారు. సీఏఏపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం మరింత పెరిగితే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని తెలుస్తోంది.

Also Read: New Year 2020: అన్ని ఫ్లైఓవర్లు, ఓఆర్ఆర్ బంద్..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.