తమ ప్రభుత్వ విధానాలపై వస్తున్న రాజకీయ విమర్శనలకు కౌంటర్ ఇవ్వడానికి బీజేపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు మూడేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలన, చేపట్టిన పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఓ రిపోర్ట్ కార్డ్ విడుదల చేయాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నెలలో ఎన్డీఏ ప్రభుత్వం మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ రిపోర్ట్ కార్డును ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, ఆర్థిక వివరాలు, లెక్కలు తదితర అంశాలను ఈ రిపోర్ట్ కార్డులో చేరుస్తారు. ప్రభుత్వం విధానాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేసేందుకు ఈ రిపోర్టు కార్డును తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీనికోసం అన్ని మంత్రిత్వ శాఖలు వేరువేరుగా నివేదికను తయారుచేస్తున్నాయి. కాగా, దేశంలో ఉద్యోగాల కల్పన, ఆర్థిక రంగంలో అస్థిరతను నివారించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతోంది. బీజేపీ కూడా అదే ధైర్యంతో ముందుకు వెళ్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే దృఢ నిశ్చయంతో ఇప్పటి నుంచే పని ప్రారంభించింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మే 26 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకుంటుంది.
దీనికోసం అన్ని మంత్రిత్వ శాఖలు వేరువేరుగా నివేదికను తయారుచేస్తున్నాయి. కాగా, దేశంలో ఉద్యోగాల కల్పన, ఆర్థిక రంగంలో అస్థిరతను నివారించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతోంది. బీజేపీ కూడా అదే ధైర్యంతో ముందుకు వెళ్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనే దృఢ నిశ్చయంతో ఇప్పటి నుంచే పని ప్రారంభించింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మే 26 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకుంటుంది.