యాప్నగరం

సరిహద్దుల్లో వందమంది తీవ్రవాదులు!

వాతావరణంలో చోటు చేసుకునే వివిధ మార్పులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టెర్రరిస్టులు పన్నాగం పన్నుతున్నారు

Samayam Telugu 5 Oct 2016, 2:28 pm
చలికాలం ప్రారంభమైతే మంచు కురుస్తుంది. ఆ మంచు వల్ల తెల్లారినా ఎదురుగా వస్తున్నదెవరో గుర్తించడం కష్టం.. కశ్మీర్ వంటి ప్రదేశాల్లోనైతే ఉదయం 10 దాటినా ఇంకా మంచుదుప్పటి ఆ ప్రాంతంపై పరుచుకునే ఉంటుంది. సరిగ్గా పాకిస్థాన్ తీవ్రవాదులు దీనికోసమే ఎదురు చూస్తున్నారు. చలికాలం ప్రారంభమైతే...వాతావరణంలో చోటు చేసుకునే వివిధ మార్పులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టెర్రరిస్టులు పన్నాగం పన్నుతున్నారు. చలికాలం ప్రారంభమయ్యే సరికి ఇండియాలో భారీ విధ్వంసం సృష్టించాలని తీవ్రవాదులు వ్యూహ రచన చేస్తున్నట్లు..సరిహద్దుల్లో ఎంతలేదన్నా వందమందికి తగ్గకుండా టెర్రరిస్టులు దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చారు.
Samayam Telugu nearly100 terrorists are being prepped at loc
సరిహద్దుల్లో వందమంది తీవ్రవాదులు!


బుధవారం మోదీ అధ్యక్షతన టెర్రరిజంపై నియమించిన కేబినేట్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో హోంమంత్రి రాజ్ నాథ్, రక్షణమంత్రి మనోహర్ పారికర్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లతో పాటు త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం ఈ కమిటీ భేటీ కావడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో, దేశంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలపై పీఎంతో చర్చించారు.
సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్థాన్ తీవ్రవాదులను దేశంపైకి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు దోవల్ మోదీకి వివరించారు. పీవోకేలో దాదాపు డజనుకుపైగా తీవ్రవాదులు స్థావరాలు ఏర్పాటు చేసినట్లు తమ నిఘాలో తేలినట్లు ఆయన చెప్పారు. చలికాలం ప్రారంభమైతే మరిన్ని దాడులు చేసేందుకు వాతావరణాన్ని తీవ్రవాదులు అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని దోవల్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని, చొరబాట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఊపేక్షించరాదని మోదీ భద్రతా బలగాలను ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.