యాప్నగరం

రామమందిర వివాదానికి చర్చలతోనే పరిష్కారం: సుప్రీం

రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదానికి చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం స్పష్టం చేసింది.

TNN 21 Mar 2017, 1:42 pm
రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదానికి చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం స్పష్టం చేసింది. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు సహకారం అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. దాదాపు శతాబ్ద కాలంగా హిందూ, ముస్లింల మధ్య కొనసాగుతోన్న ఆయోధ్య వివాదానికి పరిష్కారం కోసం రాజకీయ పార్టీల తరఫున హాజరయ్యే ప్రతినిధులతో ప్రధాన సంధానకర్తగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేర్ ప్రకటించారు.
Samayam Telugu negotiated settlement to end ramjanmabhoomi dispute supreme court
రామమందిర వివాదానికి చర్చలతోనే పరిష్కారం: సుప్రీం


ఈ విషయంపై రాజకీయ పార్టీలు కోరుకుంటే సిట్టింగ్ జడ్జ్‌ను ప్రధాన సంధానకర్తగా నియమిస్తామని, ఇందుకు ఆయన అందుబాటులో ఉన్నారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామితో జస్టిస్ ఖేర్ అన్నారు. అయితే ఇరు వర్గాలు ఒక అర్థవంతమైన పరిష్కారం దిశగా చర్చలు జరపాలని బెంచ్ స్పష్టం చేసింది. సున్నితమైన ఈ అంశానికి చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.

ఆయోధ్య వివాధంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని సుబ్రమణ్యస్వామి అనేకసార్లు సుప్రీం గడపతొక్కారు. ఈ అంశంలో మార్చి 31 న మరోసారి ప్రస్తావించాలని స్వామిని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఉత్తర్‌ప్రదేశ్ హైకోర్టు అలహాబాద్ బెంచ్ తీర్పు తర్వాత ఇరు వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 2010లో అలహాబాద్ హైకోర్టు రామజన్మభూమిని మూడు భాగాలు చేయాలని తన తీర్పులో పేర్కొంది. 2.77 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలనాన్ని మూడు భాగాలు చేసి ముస్లిం, హిందూ, నిర్మోహి అఖరాలకు సమానంగా పంచాలని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.