యాప్నగరం

నెహ్రూ వల్లే కశ్మీర్ ఇలా తయారైంది.. లోక్ సభలో అమిత్ షా ఫైర్

కశ్మీర్ సమస్యకు నాటి ప్రధాని నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణం. నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారు. మీరు మాకు చరిత్ర పాఠాలు నేర్పుతారా? అని కాంగ్రెస్ నేతలపై అమిత్ షా ఫైరయ్యారు.

Samayam Telugu 28 Jun 2019, 9:08 pm
జమ్మూ కశ్మీర్లో మూడో వంతు భాగం మనతో లేదు. దీనికి కారణం ఎవరని హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగించడానికి బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా పార్లమెంట్‌లో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను జూలై 3 నుంచి మరో ఆరు నెలలు కొనసాగించనున్నారు. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని అమిత్ షా తెలిపారు. నాటి ప్రధానిగా నెహ్రూ తీసుకున్న నిర్ణయాల వల్లే కశ్మీర్ సమస్య తలెత్తిందని అమిత్ షా విమర్శించారు.
Samayam Telugu amit shah2


నాటి హోం మంత్రి, ఉప ప్రధాని పటేల్‌‌తో అభిప్రాయంతో సంబంధం లేకుండా నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ చీఫ్ ఎద్దేవా చేశారు. మీరు మాకు చరిత్ర పాఠాలు నేర్పుతారా? అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీకి ఆయన చురకలు అంటించారు.

నెహ్రూ తీసుకున్న నిర్ణయాల కారణంగానే కశ్మీర్ సమస్య తలెత్తిందని అమిత్ షా ఆరోపించారు. కశ్మీర్లోకి పాకిస్థాన్ చొరబాటుదార్లను పంపినప్పుడు.. వారిని తరిమికొట్టాల్సిందిపోయి నెహ్రూ విరుద్ధంగా వ్యవహరించారని హోం మంత్రి మండిపడ్డారు. రాష్ట్రపతి పాలనను విధించే ఆర్టికల్ 356ను ఇప్పటి వరకూ 132సార్లు విధించారని, అందులో 93సార్లు కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రపతి పాలన విధించారని అమిత్ షా తెలిపారు.

కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 తాత్కాలికమైందని హోం మంత్రి తెలిపారు. జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు (సవరణ) 2019కు లోక్ సభ ఆమోదం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.