యాప్నగరం

మేం ఎప్పుడూ ‘హద్దు’ మీరలేదు.. భారత సైన్యం ప్రకటన

భారత సైన్యం ఎల్ఏసీని దాటొచ్చిందని.. గాల్లోకి కాల్పులు జరిపిందన్న చైనా ప్రకటనపై ఇండియన్ ఆర్మీ స్పందించింది.

Samayam Telugu 8 Sep 2020, 11:59 am
పాంగాంగ్ సో సరస్సు సమీపంలో భారత బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయన్న చైనా సైన్యం ఆరోపణలు భారత్ ఖండించింది. ఈ విషయమై ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన జారీ చేసింది. సైనిక బలగాల ఉపసంహరణకు, ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉందని ఆర్మీ స్పష్టం చేసింది. మరోవైపు చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని మండి పడింది. ఇండియన్ ఆర్మీ ఎల్ఎసీ వెంబడి ఎప్పుడూ దురాక్రమణకు పాల్పడలేదని.. ఫైరింగ్ సహా రెచ్చగొట్టే చర్యలకు దిగలేదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.
Samayam Telugu indian army


‘‘సోమవారం నాటి ఘటన విషయానికి వస్తే.. చైనా బలగాలు ఎల్ఏసీ వెంబడి మా ఫార్వార్డ్ పొజిషన్ సమీపంలోకి రావడానికి ప్రయత్నించాయి. దీన్ని అడ్డుకోబోగా.. చైనా బలగాలు భయపెట్టడానికి గాల్లోకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాయి. సైనిక, దౌత్యపరమైన, రాజకీయ చర్చలు జరుగుతుండగానే.. పీఎల్ఏ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ.. దుందుడుకుగా వ్యవహరిస్తోంది’’ అని భారత సైన్యం ప్రకటనలో పేర్కొంది.

పాంగాంగ్ సో సరస్సు సమీపంలో సోమవారం రాత్రి భారత బలగాలు చైనా సరిహద్దు దాటి వచ్చాయని, అడ్డుకోబోయిన తమ సైనికులపై కాల్పులు జరిపాయని చైనా ఆర్మీ ఆరోపించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా కాల్పులు జరిపామని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.