యాప్నగరం

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కాశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చేశారు. చిన్న, చిన్న మార్పులతో కూడిన ఈ జాబితాను కేంద్రం విడుదల చేసింది. నియామకాల విషయానికొస్తే.. జమ్మూ కాశ్మీర్‌ కొత్త గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్‌ను నియమించారు. ఈయన గతంలో బీహార్‌ గవర్నర్‌గా ఉండగా.. ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా లాల్జీ టాండన్‌ వచ్చారు.

Samayam Telugu 21 Aug 2018, 8:24 pm
ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చేశారు. చిన్న, చిన్న మార్పులతో కూడిన ఈ జాబితాను కేంద్రం విడుదల చేసింది. నియామకాల విషయానికొస్తే.. జమ్మూ కాశ్మీర్‌ కొత్త గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్‌ను నియమించారు. ఈయన గతంలో బీహార్‌ గవర్నర్‌గా ఉండగా.. ఆ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా లాల్జీ టాండన్‌ వచ్చారు. సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్.. మేఘాలయకు తథాగత రాయ్.. త్రిపురకు కప్తాన్ సింగ్ సోలంకి.. హర్యానాకు సత్యదేవ్ నారాయణ్. ఆర్యహాస్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్యను నియమించారు.
Samayam Telugu Malik


జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ విషయంలో కేంద్రం జాగ్రత్తగా వ్యవహరించింది. అమర్‌నాథ్ యాత్రను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు గవర్నర్‌గా ఉన్న వోహ్రాను ఆగస్టు 26 వరకు కొనసాగించాలని భావించింది. కాని జూన్‌లో జమ్మూ ప్రభుత్వం రద్దు కావడంతో ఆలోచనలో పడింది. అక్కడ గవర్నర్ పాలన అమలులో ఉండటంతో గవర్నర్‌ను మార్చేసింది. మాలిక్ కూడా సీనియర్ రాజకీయనేత.. బీహార్‌కు గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉంది. మిగిలిన రాష్ట్రాల విషయానికొస్తే.. కొన్ని మార్పులు చేర్పులు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.