యాప్నగరం

నేడు ఓ కొత్త భారత్ ఆవిర్భవించింది: మోడీ

ఈ ఫలితాలతో నేడు ఓ కొత్త భారత్ ఆవిర్భవించింది. నిరుపేదల దృఢ సంకల్పం, మధ్య తరగతి వారి ఆకాంక్షలే..

TNN 12 Mar 2017, 11:25 pm
ఈ ఫలితాలతో నేడు ఓ కొత్త భారత్ ఆవిర్భవించింది. నిరుపేదల దృఢ సంకల్పం, మధ్య తరగతి వారి ఆకాంక్షలే భారత్‌కి కొత్త ఎత్తులకి ఏగే ఉత్సాహాన్నిస్తాయి. మరింత వినయ, విధేయతలతో వుండాల్సిన బాధ్యత మాపై వుంది. పవర్ అంటే పదవులు కాదు. పవర్ అంటే ప్రజలకి సేవ చేయడానికి ఓ అవకాశం లాంటిది. అధికారాన్ని ప్రజలకి సేవ చేసే అవకాశంగా భావిస్తామే తప్ప మరోలా కాదు. నేడు ఏర్పడిన నూతన భారత్ మహిళల ఆకాంక్షల్ని నిజం చేసేందుకు దోహదపడుతుంది. నిరుపేదలకి కొత్త అవకాశాలు కల్పిస్తుంది. యువత కలలు నిజం చేస్తుంది. ఆదివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇవి.
Samayam Telugu new india emerged with these poll resultspm modi
నేడు ఓ కొత్త భారత్ ఆవిర్భవించింది: మోడీ


నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో ప్రధాని మోడీకి ఘన సన్మానం జరిగింది. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, మద్దతుదారుల సమక్షంలో జరిగిన ఈ సన్మాన సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ... తన దృష్టిలో ఎన్నికలని కేవలం రాజకీయ కోణంలో చూడను. ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని భాగస్వామ్యులని చేస్తాయి. ఎన్నికలు ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తాయి అని అభిప్రాయపడ్డారు. పండిట్ దీన్ దయాల్ శతజయంతి వేడుకల సందర్భంగా బీజేపీ ఈ ఘన విజయం అందుకోవడం తమ పార్టీకి మరింత ఆనందాన్నించింది అని అన్నారు మోడీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.