యాప్నగరం

ఎన్‌ఎస్‌జీ సభ్యత్వానికి న్యూజిలాండ్ మద్దతు

అణ్వాయుధాల సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ), ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్‌లలో భారత్ కు సభ్యత్వం కల్పించేందుకు, తమ వంతుగా కృషి చేస్తామని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్ కీ హామీ ఇచ్చారు.

TNN 26 Oct 2016, 4:15 pm
అణ్వాయుధాల సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ), ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్‌లలో భారత్ కు సభ్యత్వం కల్పించేందుకు, తమ వంతుగా కృషి చేస్తామని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్ కీ హామీ ఇచ్చారు.
Samayam Telugu new zealand backs indias nsg and agreed to bilateral trade free
ఎన్‌ఎస్‌జీ సభ్యత్వానికి న్యూజిలాండ్ మద్దతు


న్యూఢిల్లీలో బుధవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ జాన్ కీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలపై పలు ఒప్పందాలు కుదుర్చున్నారు. భారత్ తో స్నేహం ఇరుదేశాల అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ఈ సందర్భంగా కీ అన్నారు.

సైబర్ సెక్యూరిటీ, ఆహార భద్రత, విద్యా, సాంస్కృతిక పరమైన అంశాలపై చర్చించినట్లు ఇరువురు ప్రధానులు సంయుక్తంగా మీడియాకు తెలిపారు.

న్యూజిలాండ్ తో ఒప్పందం వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగపడతాయని మోదీ అన్నారు.

ఇరుదేశాల మైత్రి గ్లోబల్ ఎకనామికల్ డెవెలప్ మెంట్ కు తోడ్పడుతుందని మోదీ గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.