యాప్నగరం

న్యూజిలాండ్ పీఎం భారత పర్యటన షురూ

న్యూజిలాండ్ పీఎం భారత పర్యటనకు విచ్చేశారు.

TNN 26 Oct 2016, 12:00 am
న్యూజిలాండ్ పీఎం జాన్ కీ భారత పర్యటనకు విచ్చేశారు. ఆయన మూడు రోజుల పాటు మనదేశంలో పర్యటిస్తారు. మంగళవారం నాడు ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బుధవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా వీరి మధ్య పలు ద్వైపాక్షిక అంశాలు, ఒప్పందాలపై చర్చలు జరుగుతాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్.ఎస్.జి)లో భారత్ సభ్యత్వానికి న్యూజిలాండ్ మద్దతును ప్రధాని మోడీ కోరే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్.ఎస్.జి. సమావేశంలో మన దేశ సభ్యత్వం కోసం అమెరికా సహా పలు కీలక దేశాలు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, చైనా ఆ ప్రతిపాదనను అడ్డుకుంది. ఎన్.పి.టి (న్యూక్లియర్ నాన్-ప్రోఫిలరేషన్ ట్రీటీ)లో భారతదేశం సంతకం పెట్టనందున ఎన్.ఎస్.జి.లో సభ్యత్వానికి తాము అంగీకరించబోమని చైనా మోకాలడ్డింది. ఈ నేపథ్యంలో మన సభ్యత్వం ఎన్.ఎస్.జి. గుమ్మం వరకు వెళ్లి లోపలకు కేవలం అడుగుదూరంలో నిలిచినట్లయింది. ఈ పరిస్థితుల్లో మిగిలిన ఎన్.ఎస్.జి. దేశాల మద్దతుకోసం మోడీ తీవ్రంగా యత్నిస్తున్నారు. న్యూజిలాండ్ పీఎం పర్యటనను సావకాశంగా మలచుకుని ఆయన అంగీకారం పొందేందుకు దౌత్యపరంగా ప్రయత్నిస్తారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.