పసికందు మృతదేహాన్ని పట్టుకుని ఓ కన్నతండ్రి రోదిస్తున్న ఫొటో ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. చూడగానే కలచివేస్తోంది. బెంగాల్లోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు చేస్తున్న సమ్మె మిగిల్చిన దారుణమిది. పశ్చిమ బెంగాల్లోని అగర్పారాకు చెందిన అభిజిత్ మాలిక్ భార్య రెండు రోజుల కిందట బిడ్డకు జన్మినిచ్చింది. కానీ, పసికందు ఆరోగ్య పరిస్థితి బాలేదు.
పసికందును చేత పట్టుకొని ఆ తండ్రి పలువురు వైద్యుల వద్దకు పరుగెత్తాడు. కానీ, సమ్మెలో ఉన్న కారణంగా వైద్యం చేయడం కుదరదని చాలా మంది డాక్టర్లు చెప్పారు. సమయానికి వైద్యం అందక పోవడంతో ఆ బిడ్డ గురువారం (జూన్ 13) చనిపోయింది. దీంతో అభిజిత్ మాలిక్కు కన్నీరే మిగిలింది.
అభిజిత్ తన బిడ్డ మృతదేహాన్ని ఎత్తుకుని రోదిస్తుండగా.. ఓ ఫొటోగ్రాఫర్ ఫొటో తీశారు. వైద్యుల సమ్మె ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఫొటోనే నిదర్శనం అని పేర్కొంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటో వైరల్గా మారింది. వైద్యుల తీరుపై మండిపడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ రోగి సోమవారం రాత్రి మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమవాడు చనిపోయాడని.. అతడి బంధువులు కోపంతో ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడిని నిరసిస్తూ బెంగాల్లోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లోని జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో జూడాలు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో వైద్యం అందక పేషంట్లు అవస్థలు పడుతున్నారు.
పసికందును చేత పట్టుకొని ఆ తండ్రి పలువురు వైద్యుల వద్దకు పరుగెత్తాడు. కానీ, సమ్మెలో ఉన్న కారణంగా వైద్యం చేయడం కుదరదని చాలా మంది డాక్టర్లు చెప్పారు. సమయానికి వైద్యం అందక పోవడంతో ఆ బిడ్డ గురువారం (జూన్ 13) చనిపోయింది. దీంతో అభిజిత్ మాలిక్కు కన్నీరే మిగిలింది.
అభిజిత్ తన బిడ్డ మృతదేహాన్ని ఎత్తుకుని రోదిస్తుండగా.. ఓ ఫొటోగ్రాఫర్ ఫొటో తీశారు. వైద్యుల సమ్మె ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఫొటోనే నిదర్శనం అని పేర్కొంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటో వైరల్గా మారింది. వైద్యుల తీరుపై మండిపడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ రోగి సోమవారం రాత్రి మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమవాడు చనిపోయాడని.. అతడి బంధువులు కోపంతో ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడిని నిరసిస్తూ బెంగాల్లోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లోని జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో జూడాలు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో వైద్యం అందక పేషంట్లు అవస్థలు పడుతున్నారు.