యాప్నగరం

పంజాబ్ సర్కార్‌పై మరో పిడుగు... చెత్త నిర్వహణలో ఫెయిల్.. రూ.2000 కోట్ల ఫైన్

పంజాబ్ (Punjab) ప్రభుత్వం చెత్త నిర్వహణలో ఫెయిల్ అయిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్ధారించింది. దీంతో పంజాబ్ సర్కార్‌కు భారీ ఫైన్ విధించింది. కోట్లాది రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. నెలలోపు కచ్చితంగా రూ.100 కోట్లు ఇవ్వాలని సూచించింది. దాంతో భగవంత్ సింగ్ మాన్ సర్కార్‌పై మరో పిడుగు పడినట్టైంది. ఇప్పటికే సీఎం భగవంత్ సింగ్ మాన్ అనేక విమర్శలకు గురవుతున్నారు. ఆయన మద్యం సేవించి ఫ్లైట్ ఎక్కారని కొన్ని రోజులుగా చర్చ నడుస్తుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 24 Sep 2022, 1:07 pm

ప్రధానాంశాలు:

  • పంజాబ్ ప్రభుత్వానికి మరో షాక్
  • రూ.2000 కోట్లు చెల్లించాలని ఆదేశం
  • నెలలోపు రూ.100 కోట్లు ఇవ్వాలని సూచన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Punjab waste management
పంజాబ్ (Punjab) ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు రూ.2000 కోట్ల రూపాయల జరిమానా విధించింది. పర్యావరణానికి హాని కలిగించే ఘన, ద్రవ వ్యర్థాలను సరిగ్గా నిర్వహించనందుకు ఎన్‌జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మేలో లూథియానా అగ్నిప్రమాదంలో ఏడుగురి మృతిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను విడుదల చేసింది.
ఆ నివేదికలో " 2016 ప్రకారం ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలు, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే పౌరుల హక్కుల ప్రకారం, చెత్తను డంప్ చేయడంలో పంజాబ్ రాష్ట్ర అధికార వైఫల్యం అయినట్టు నిర్ధారణ అయింది. వ్యర్థాలను క్లియర్ చేయకపోవడం వల్ల కాలుష్యం వృద్ధి చెందుతుంది. అందరి ఆరోగ్యానికి హానికరం.." అని నివేదికలో పేర్కొన్నారు.

ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లూథియానా మున్సిపల్ కార్పొరేసన్‌ను ఒక నెలలోపు రూ. 100 కోట్లను చెల్లించాలని జూలై నెలలో ఆదేశించింది. మధ్యంతర పరిహారం నిమిత్తం.. మానిటరింగ్ కమిటీ సూచించే పరిష్కార చర్యల కోసం ఈ డబ్బును తప్పనిసరిగా జమ చేయాలని ఆదేశించింది. ఒక వేళ కార్పొరేషన్ అటువంటి ఫైన్ ఇవ్వలేకపోతే.. దానిని రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చని NGT పేర్కొంది.

పంజాబ్ ప్రభుత్వంపై ఎన్‌జీటీ ఈ విధంగా జరిమానాలు వేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా విధించింది. నవంబర్ 2018లో పారిశ్రామిక మురుగు నీటిని ఎక్కువగా విడుదల చేసి.. సట్లెజ్ బియాస్ నదులను కలుషితం చేసినందుకు NGT రూ. 50 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా విధిస్తున్నప్పుడు.. ఆ సంవత్సరం మేలో గురుదాస్‌పూర్ జిల్లాలోని చక్కెర పరిశ్రమ నుంచి మొలాసిస్ విడుదల కారణంగా చేపలు చనిపోవడాన్ని కూడా ఎన్‌జీటీ పరిగణనలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ఎన్‌జీటీ బెంచ్ రెండు వారాల్లో పరిశ్రమల నుంచి జరిమానాను వసూలు చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్.. వార్తల్లో నిలిచారు. ఆయన తాగి విమానం ఎక్కారాని, అందుకోసం అతనిని కిందకు దించేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. సీఎం వల్ల ఫ్లైట్ కొన్ని గంటల పాటు ఆలస్యమైందని, దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టివేసింది. అందులో నిజంలేదని చెప్పుకొచ్చింది. ప్రతిపక్షాల నేతలు మాత్రం నిజనిజాలు తేల్చాలని పట్టుబడుతున్నాయి. అయితే గతంలో భగవంత్ సింగ్ మాన్ మద్యం సేవించేవారు.. కానీ ఓ బహిరంగ సభలో ఇకపై మద్యం ముట్టనని ఆయన ప్రకటించారు.

Read More National News and Telugu News

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.