యాప్నగరం

ఉగ్రవాదుల అరెస్ట్.. బెంగళూరులో కలకలం!

NIA: జాతీయ దర్యాప్తు బృందానికి చెందిన అధికారులు బెంగళూరులో ఇద్దరు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. నగరంలో వరసగా టెర్రరిస్టులు పట్టుబడుతుండటం బెంగళూరు వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

Samayam Telugu 28 Oct 2020, 3:33 pm
బెంగళూరులో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుపడటం కలకలం రేపింది. జాతీయ దర్యాప్తు బృందం (NIA) బుధవారం (అక్టోబర్ 28) ఓ ఇంటిపై దాడులు నిర్వహించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. అనుమానితులిద్దరూ ఐసిస్ (ISIS) ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 20 రోజుల కిందట అరెస్టైన ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరులో వీరు ఏవైనా విధ్యంసక కార్యకలాపాలకు ప్రణాళికలు చేశారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని NIA అధికారులు తెలిపారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
NIA


20 రోజుల కిందట National Investigation Agency ఐసిస్‌తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలో ఒక వ్యక్తి తమిళనాడుకు చెందిన అబ్దుల్ అహ్మద్ క‌దీర్ (40) కాగా, మరో వ్యక్తి బెంగ‌ళూరుకు చెందిన ఇర్ఫాన్ న‌జీర్‌గా గుర్తించారు. వీరు ఇచ్చిన సమాచారంతో ఆ తర్వాత కొద్ది రోజులకే బెంగళూరులో ఓ ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించారు. నాటి నుంచి కర్ణాటక పోలీసులకు కలిసి ఎన్‌ఐఏ పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది.

పట్టుబడిన వారి నుంచి సమాచారం లాగి ఉగ్రవాదులను అరెస్టు చేస్తోంది. నగరంలో వరసగా ఉగ్రవాదులు పట్టుబడుతుండటంతో బెంగళూరు వాసులు ఆందోళనకు గురవుతున్నారు.

Also Read: రూపే కార్డు ఉందా.. అయితే పండగే! వివిధ బ్రాండ్లపై 65% డిస్కౌంట్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.