యాప్నగరం

తీవ్రవాదులకు నిధులు: హురియత్ నేతల అరెస్ట్

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలతో కశ్మీర్‌లోని వేర్పాటువాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదుపులోకి తీసుకుంది.

TNN 24 Jul 2017, 3:49 pm
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలతో కశ్మీర్‌లోని వేర్పాటువాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదుపులోకి తీసుకుంది. వీరిలో హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీ మేనల్లుడుతోపాటు మరో ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో అల్తాఫ్ షా, అయాజ్ అక్బర్, పీర్ సైఫుల్లా, మెహరాజ్ కల్వాల్, షాహిద్ ఉల్ ఇస్లామ్, నయీమ్ ఖాన్, బిట్టా కరేటాలు ఉన్నారు. వీరిలో షా, అక్బర్, కల్వాల్, సైఫుల్లా, షాహిద్, ఖాన్‌లను శ్రీనగర్‌లోనూ, కరేటాను ఢిల్లీ అరెస్టు చేశారు. శ్రీనగర్‌లో అరెస్ట్ చేసిన వారిని కూడా ఢిల్లీకి తరలించి ప్రశ్నించనున్నారు.
Samayam Telugu nia arrests 7 kashmiri separatists on charges of funding terrorism
తీవ్రవాదులకు నిధులు: హురియత్ నేతల అరెస్ట్


గిలానీ మేనల్లుడు అల్తాఫ్ షా నివాసంపై ఎన్ఐఏ గతనెలలో దాడిచేసి కీలక ఆధారాలను సేకరించింది. తెహ్రిక్ ఇ హురియత్ విధానాలతో ప్రభావితమైన షా తీవ్రవాదులకు నిధులు అందజేసినట్లు అధికారులు గుర్తించారు. హురియత్ కాన్ఫరెన్స్ ముఖ్య నేతల్లో ఒకరైన మిర్వాజ్ ఉమర్ ఫరూక్ ముఖ్య అనుచరుడైన షాహిద్ ఉల్ ఇస్లామ్ నివాసంలో కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. లోయలో విధ్వంసక కార్యకలాపాల కోసం నిధులను సేకరిస్తున్న వేర్పాటువాదుల అణిచివేత ప్రయత్నాల్లో భాగంగా ఎన్ఐఏ దాడులను నిర్వహించింది. ఆ సందర్భంగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తొయిబాతో సహా మిగతా వారికి వీరి ఖాతాల నుంచి రూ.2 కోట్ల మళ్లినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.

భద్రతా దళాలపై రాళ్లు రువ్వడం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడి సహా తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేవారిని గుర్తించడానికి ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. 1990 వ దశకం ఆరంభంలో కశ్మీర్ లోయలో తీవ్రవాద కార్యకలాపాల ప్రారంభం తర్వాత జాతీయ పరిశోధన సంస్థ ఇలా దాడి చేయడం ఇదే తొలిసారి. 2002లో గిలానీ ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులు అతడి లావాదేవీలను స్తంభింపజేసినా అతడికి వ్యతిరేకంగా ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు చేయలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.