ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారులు ఓ వక్తి నుంచి రూ.58 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూర్కు నగదును తరలిస్తున్న నైజీరియన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నగదులో రూ.53.78లక్షలు కొత్త నోట్లు కాగా..రూ.4.29లక్షలు పాత నోట్లున్నాయని అధికారులు తెలిపారు. నగదును సీఐఎస్ఎఫ్ అధికారులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. భారీమొత్తంలో నగదుకు సంబంధించిన వివరాలు సేకరించిన అనంతరం ఆ నైజీరియన్ను వదిలిపెట్టినట్లు సమాచారం
భారీ నగదుతో పట్టుబడ్డ నైజీరియన్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారులు ఓ వక్తి నుంచి రూ.58 లక్షలు నగదు
Samayam Telugu 23 Dec 2016, 11:50 am