యాప్నగరం

రంగంలోకి కుమారస్వామి తనయుడు!

ఒకవైపు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా.. మరోవైపు ఆయన వారసుడు కూడా ఇప్పుడు రాజకీయ రణరంగంలోకి దిగుతున్నాడు. ఒక సినిమాలో నటించి హీరోగా

Samayam Telugu 23 May 2018, 2:11 pm
ఒకవైపు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా.. మరోవైపు ఆయన వారసుడు కూడా ఇప్పుడు రాజకీయ రణరంగంలోకి దిగుతున్నాడు. ఒక సినిమాలో నటించి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుమారస్వామి పెద్ద కొడుకు నిఖిల్ గౌడ ఇప్పుడు కర్ణాటక రాజకీయంలోకి దిగాడు. ప్రమాణస్వీకారానికి ముందుగా కుమారస్వామి ఆలయాల సందర్శనలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి తనయుడు నిఖిల్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కావడం ఆసక్తిదాయకంగా మారింది.
Samayam Telugu nikhilg


ప్రస్తుతం జేడీఎస్ ఎమ్మెల్యేలు క్యాంపుల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. బలపరీక్షపూర్తి అయ్యేంత వరకూ వీళ్లను బయటకు వదిలేలా లేరు. ఈ నేపథ్యంలో వీరితో నిఖిల్ గౌడ సమావేశం అయ్యాడు. కుమారస్వామి అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యేలతో నిఖిల్ సమావేశం అయినట్టుగా సమాచారం.

ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి కోరికల చిట్టాను తయారు చేశాడట నిఖిల్. ఎవరికేం కావాలో ఆరా తీశాడట. ఈ సందర్భంగా చాలా మంది ఎమ్మెల్యేలకు తమకు మంత్రి పదవి కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. చాలా మంది ఇదే కోరికను వ్యక్తం చేశారట. వాళ్ల కోరికలను విన్న నిఖిల్ గౌడ ఆ విషయాలను తండ్రి వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టుగా సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.