దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని కరోల్ బాగ్లో ఉన్న అర్పిత్ ప్యాలస్ హోటల్లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 9 మంది అగ్నికి ఆహుతయ్యారు. తీవ్రంగా గాయపడిన మరికొంత మందిని చికిత్స నిమిత్తం ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 26 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 25 మందిని హోటల్ లోపలి నుంచి బయటికి సురక్షితంగా తీసుకువచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మరో ఇద్దరు భవనంపై నుంచి కిందికి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారని వెల్లడించారు.
అర్పిత్ ప్యాలస్ హోటల్ బహుళ అంతస్తుల భవనం. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చలి ఎక్కువగా ఉండటంతో అంతా హీటర్లు వేసుకుని పడుకుంటారని, ఈ హీటర్ కారణంగా ఏదో ఒక రూమ్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. భవనం పై అంతస్తులో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అందులోకి ప్రవేశించడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. కిటికీల అద్దాలు పగలగొట్టి వారు లోపలికి ప్రవేశించారు. అగ్నికీలలు భారీగా ఎగసిపడటంతో హోటల్ భవనంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగ అలుముకుంది.
అర్పిత్ ప్యాలస్ హోటల్ బహుళ అంతస్తుల భవనం. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చలి ఎక్కువగా ఉండటంతో అంతా హీటర్లు వేసుకుని పడుకుంటారని, ఈ హీటర్ కారణంగా ఏదో ఒక రూమ్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. భవనం పై అంతస్తులో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అందులోకి ప్రవేశించడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. కిటికీల అద్దాలు పగలగొట్టి వారు లోపలికి ప్రవేశించారు. అగ్నికీలలు భారీగా ఎగసిపడటంతో హోటల్ భవనంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగ అలుముకుంది.