యాప్నగరం

నిపా వైరస్: పబ్లిక్ కమిషన్ పరీక్షలు వాయిదా..

కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు వాయిదాపడ్డాయి. 'నిపా వైరస్' ప్రభావం వల్ల జూన్ 16 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం (జూన్ 1) కమిషన్ ప్రకటించింది.

Samayam Telugu 1 Jun 2018, 8:37 pm
కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు వాయిదాపడ్డాయి. 'నిపా వైరస్' ప్రభావం వల్ల జూన్ 16 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం (జూన్ 1) కమిషన్ ప్రకటించింది. మే 26న జరగాల్సిన సివిల్ పోలీస్ ఆఫీసర్ 'ఓఎంఆర్' పరీక్షను ఇప్పటికే వాయిదా వేసిన కమిషన్ తాజాగా.. అన్ని పరీక్షలను వాయిదావేస్తున్నట్లు తెలిపింది. కేరళలో 'నిపా' వైరస్ తీవ్రత నేపథ్యంలో.. పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో కమిషన్ ఈ మేరకు పరీక్షల వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
Samayam Telugu nipah


ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తిస్తాయని కమిషన్ తెలిపింది. అయితే ఆన్‌లైన్ పరీక్షలను మాత్రం షెడ్యూలు ప్రకారమే నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

కేరళలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న నిపా వైరస్.. ఇప్పటి వరకు 17 మందిని బలితీసుకుంది. గబ్బిలాలు, పందుల ద్వారా వ్యాపించే ఈ వైరస్ కేరళలో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. దీంతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ హైఅలర్ట్ ప్రకటించారు. నిపా వైరస్ సోకిన ఎవరికీ చికిత్స నిరాకరించరాదని, నిపా ఫీవర్‌తో ఆసుపత్రికి వచ్చేవాళ్లకు చికిత్స ఇవ్వకపోవడాన్ని నేరంగా భావించి శిక్షిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి పి.విజయన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.