యాప్నగరం

ఆ రోజు ఢిల్లీలో లేనన్న నిర్భయ దోషికి షాకిచ్చిన సుప్రీం

నిర్భయ దోషులు ముకేశ్ సింగ్, పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. 2012 డిసెంబర్ 16న నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనన్న ముకేశ్ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది.

Samayam Telugu 19 Mar 2020, 3:22 pm
మరణ శిక్ష అమలు తేదీ దగ్గరపడుతున్న వేళ... ఉరిని వాయిదా వేయడం కోసం నిర్భయ దోషులు చట్టాల్లోని లొసుగులన్నీ ఉపయోగించుకుంటున్నారు. ఉరి శిక్ష అమలు కాకుండా ఉండటం కోసం రకరకాలుగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. నిర్భయ హత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్‌ అని ఒకరు వాదిస్తుంటే.. ఆ సమయంలో అసలు తాను ఢిల్లీలోనే లేనని మరొకరు వాదిస్తున్నారు. పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టి వేసిన సుప్రీం.. ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టి వేసింది.
Samayam Telugu MUKESH_SINGH


నిర్భయ హత్యాచారం జరిగిన సమయంలో తాను రాజస్థాన్‌లో ఉన్నానని.. పోలీసులు తనను బలవంతంగా ఢిల్లీ తీసుకొచ్చారని ఆరోపిస్తూ... ముకేశ్ సింగ్ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీం దాన్ని కొట్టివేసింది. అతడి వాదనలు నిజమని నిరూపించడానికి ఆధారాలేవీ లేవని పేర్కొంది. ముకేశ్ సింగ్ తనకున్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నాడని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.

ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ ప్రకారం నిర్భయ దోషులను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తిహార్ జైల్లో ఉరి తీయాల్సి ఉంది. కానీ మరణ శిక్షను మరోసారి వాయిదా వేయించడమే లక్ష్యంగా నిర్భయ దోషులు, వారి కుటుంబీకులు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి తన క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మరో దోషి అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.