యాప్నగరం

నిప్పుతో చెలగాటం ఆడుతున్నావ్.. నిర్భయ లాయర్‌తో జడ్జి

నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్లను లాయర్ ఆలస్యంగా దాఖలు చేస్తున్నారని జడ్జి అభిప్రాయపడ్డారు. మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ లాయర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Samayam Telugu 2 Mar 2020, 4:07 pm
నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో అతడు కొద్ది గంటల వ్యవధిలోనే క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేయగా.. అంతే వేగంగా రాష్ట్రపతి కూడా ఆ పిటీషన్‌ను తిరస్కరించారు. వాస్తవానికి నలుగురు దోషులను మార్చి 3న ఉదయం ఆరుగంటలకు ఉరి తీయాల్సింది. ఉరి శిక్ష అమలును ఆలస్యం చేయడం కోసం నలుగురు దోషులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం లాంటి మార్గాలను ఉపయోగించుకున్నారు.
Samayam Telugu ap singh


దీంతో నిర్భయ దోషుల ఉరి రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారి కూడా ఉరి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున.. ఉరి వేసే విషయమై పటియాలా హౌస్ కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల తరఫున వాదనలు వినిపిస్తోన్న లాయర్‌ను జడ్జి హెచ్చరించారు. మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావ్.. జాగ్రత్త అని ఏపీ సింగ్‌ను ఉద్దేశించి జడ్జి వ్యాఖ్యానించారు. ఎవరైనా ఒక తప్పటడుగు వేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసంటూ జడ్జి వ్యాఖ్యానించారు.

నిర్భయకు న్యాయం చేయడాన్ని ఆలస్యం చేసేలా దోషుల తరఫు లాయర్ వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంలో జడ్జి ఇలా మాట్లాడారు. తొలిసారి ఉరి అమలు వాయిదా పడినప్పుడు ఉరిశిక్ష అమలు చేయనీయబోను అని ఏపీ సింగ్ తనతో ఛాలెంజ్ చేశారని నిర్భయ తల్లి వాపోయిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.