యాప్నగరం

రఫెల్‌పై రాహుల్ వ్యాఖ్యలకు నిర్మలా కౌంటర్

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది.

Samayam Telugu 20 Jul 2018, 2:47 pm
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. యూపీఏ హయాంలో ఒక్కో రాఫెల్‌ విమానం ఖరీదు రూ.520కోట్లయితే ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని ఎవరితోనో చర్చలు జరిపారని, ఇప్పడు దాని విలువ రూ.1,600కోట్లుకు చేరిందని రాహుల్ ఆరోపించారు. నేనే స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని కలిసినప్పుడు ఆయన ఎలాంటి ఒప్పందం జరగలేదని చెప్పారని, మోదీ సూచనలతోనే రక్షణ మంత్రి అబద్ధాలు చెబుతున్నారని, ఒక వ్యక్తికి రాఫెల్‌ కాంట్రాక్టు వెళ్లిందని ఆయనకు వేల కోట్ల లాభం చేకూరిందని రాహుల్‌ అన్నారు.
Samayam Telugu నిర్మలా సీతారామన్


రాహుల్‌ వ్యాఖ్యలపై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా స్పందించారు. రఫెల్ ఒప్పందంలో రహస్యాలేమీ లేవని, దీనిపై యూపీఏ-1 హయాంలోనే సంతకాలు చేశారని ఆమె స్పష్టం చేశారు. ఆర్టికల్ 10 ప్రకారం రఫెల్ యుద్ధ విమానాలపై ఫ్రాన్స్‌తో కేంద్ర ప్రభుత్వం 2008 జనవరి 25న సంతకం చేసిందని తెలిపారు. దీనిపై నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోని సంతకం చేశారని అన్నారు. అంతేకాదు రఫెల్ ఒప్పందం గురించి ఒప్పందాన్ని బహిర్గతం చేయలేమని భారత మీడియా ప్రతినిధులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశారని ఆమె తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.