యాప్నగరం

నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా.. నీతి భవన్ మూసివేత

Delhi: నీతి ఆయోగ్ భవనంలో కరోనా అలజడి రేగింది. నీతి భవన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి వైరస్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనంలో పారిశుధ్య పనులు చేపట్టారు.

Samayam Telugu 28 Apr 2020, 1:59 pm
నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవనాన్ని మూసేశారు. తగిన జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే పార్లమెంట్, రాష్ట్రపతి భవన్‌లో కలకలం రేపిన కరోనా వైరస్.. తాజాగా నీతి ఆయోగ్‌లో అలజడి సృష్టించడం గమనార్హం. నీతి ఆయోగ్ భవనంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సంస్థ అధికారిక ట్విటర్ ద్వారా మంగళవారం (ఏప్రిల్ 28) వెల్లడించారు. ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు.
Samayam Telugu నీతి భవన్
NIti


కరోనా పాజిటివ్ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తులందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. నీతి భవన్‌లో ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన జాగ్రత్తలన్నీ పాటిస్తున్నామని తెలిపారు. భవనాన్ని 48 గంటల పాటు మూసేసి జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పారిశుధ్య పనులు చేపట్టామని, వైరస్ నియంత్రణ రసాయనాలను చల్లుతున్నామని తెలిపారు.

Must Read: కొద్ది రోజుల్లో కరోనా లేని తెలంగాణ.. నేటికి 21 జిల్లాలు: కేసీఆర్

మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 3108కి చేరింది. సోమవారం ఒక్క రోజే 190 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పులువరు డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా బారినపడటం ఆందోళన కలిగించే అంశం. ఓ ఆస్పత్రిలో 75 మంది నర్సులకు కరోనా సోకింది. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులకు కూడా పాజిటివ్‌గా తేలింది.

ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది కరోనా బారిన పడ్డారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో ఇప్పటివరకూ 877 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 54 మంది మరణించారు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఢిల్లీలో లాక్‌డౌన్‌కు సంబంధించి సోమవారం కొన్ని సడలింపులు ఇచ్చారు. ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, వెటర్నరీ డాక్టర్లపై ఆంక్షలు తొలగించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, శాస్త్రవేత్తల ప్రయాణాలపై ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆంక్షలు తొలగించింది.

Also Read: 14 మంది బీఎస్‌ఎఫ్ జవాన్లు క్వారంటైన్‌కు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.