రూ.500, రూ.1,000 పాత నోట్ల రద్దు ప్రకటన తర్వాత అందరికీ అవసరమైనంత స్థాయిలో కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడు చాలామంది నగదు రహిత చెల్లింపుల విధానాన్నే ఆశ్రయిస్తున్నారు. నగదు లేకుండానే చెల్లింపులు జరపడం కోసం ఇప్పటికే అనేక డిజిటల్, ఆన్లైన్ పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, తాజాగా నోట్ల రద్దు నేపథ్యంలో ఇకపై కూడా అవినీతి, అక్రమ లావాదేవీలని అరికట్టడం కోసం నగదు రహిత చెల్లింపుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నగదురహిత చెల్లింపులకు ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తోంది నీతి ఆయోగ్.
నగదురహిత చెల్లింపులు చేసేవారికి వారానికి ఓసారి డ్రా పద్ధతిలో, అలాగే మూడు నెలలకు ఓసారి బంపర్ డ్రా తీయడం ద్వారా అందులో గెలుపొందిన వారికి తగిన విధంగా ప్రోత్సాహాకాలు అందజేయాలని నీతి ఆయోగ్ సూచించింది. అందుకోసం కొత్త కాన్సెప్టులని రూపొందించాల్సిందిగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ని నీతి ఆయోగ్ కోరింది.
నగదురహిత చెల్లింపుల పద్దతి ద్వారా ఇకపై పన్ను ఎగ్గొట్టడానికి వీలుండకపోగా ఇంతకుముందులా నల్లధనం పోగేయడానికి వీలు ఉండదు అని నీతి ఆయోగ్ భావిస్తోంది. అంతేకాకుండా ఆఫ్రికా ఖండంలోని కెన్యా లాంటి దేశంలో ఈ ప్రయోగం ద్వారా ఫలితాల్ని సాధించగలిగినప్పుడు మనదేశంలో 65% జనాభా 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. పైగా ఎంతోమందికి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, పట్టు వున్నాయి. అటువంటప్పుడు మన దేశంలో ఎందుకు ఇది సాధ్యపడదు అని నీతి ఆయోగ్ ప్రశ్నిస్తోంది.
> నగదురహిత చెల్లింపులకి ప్రోత్సాహకాల పథకం వివరాలిలా వుండనున్నాయి.
> నగదురహిత చెల్లింపులు జరిపే వినియోగదారులు, వర్తకులు ఈ పథకంకు అర్హులు
> వారానికి ఓసారి లక్కీ డ్రా తీసి బహుమతుల పంపిణీ
> మూడు నెలలకు ఓసారి బంపర్ డ్రా తీసి అద్భుతమైన కానుకల్ని అందజేయాలి
> పేదలు, దిగువ మధ్య తరగతి, చిరు వ్యాపారులని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించాలి.
> అన్నిరకాల డిజిటల్ పేమెంట్లు( యూఎస్ఎస్డీ, ఏఈపీఎస్, యూపీఐ, రూపే కార్డ్స్ వంటివి) ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలి.
> వ్యాపారుల విషయానికొస్తే, వారి వద్ద వున్న పీఓఎస్ మెషిన్పై జరిగే వ్యాపార వావాదేవీలు అన్నీ ఈ పథకానికి వర్తిస్తాయి
> నవంబర్ 8 తర్వాత డిజిటల్ పేమెంట్లు జరిపిన ప్రతీ ఒక్కరు ఈ పథకానికి అర్హులే.
> త్వరలోనే ఈ నగదురహిత చెల్లింపులకి ఇచ్చే ప్రోత్సాకాలకు సంబంధించిన పథకం మార్గదర్శకాలు, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్టు నీతి ఆయోగ్ తెలిపింది.
నగదురహిత చెల్లింపులు చేసేవారికి వారానికి ఓసారి డ్రా పద్ధతిలో, అలాగే మూడు నెలలకు ఓసారి బంపర్ డ్రా తీయడం ద్వారా అందులో గెలుపొందిన వారికి తగిన విధంగా ప్రోత్సాహాకాలు అందజేయాలని నీతి ఆయోగ్ సూచించింది. అందుకోసం కొత్త కాన్సెప్టులని రూపొందించాల్సిందిగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ని నీతి ఆయోగ్ కోరింది.
నగదురహిత చెల్లింపుల పద్దతి ద్వారా ఇకపై పన్ను ఎగ్గొట్టడానికి వీలుండకపోగా ఇంతకుముందులా నల్లధనం పోగేయడానికి వీలు ఉండదు అని నీతి ఆయోగ్ భావిస్తోంది. అంతేకాకుండా ఆఫ్రికా ఖండంలోని కెన్యా లాంటి దేశంలో ఈ ప్రయోగం ద్వారా ఫలితాల్ని సాధించగలిగినప్పుడు మనదేశంలో 65% జనాభా 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. పైగా ఎంతోమందికి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, పట్టు వున్నాయి. అటువంటప్పుడు మన దేశంలో ఎందుకు ఇది సాధ్యపడదు అని నీతి ఆయోగ్ ప్రశ్నిస్తోంది.
> నగదురహిత చెల్లింపులకి ప్రోత్సాహకాల పథకం వివరాలిలా వుండనున్నాయి.
> నగదురహిత చెల్లింపులు జరిపే వినియోగదారులు, వర్తకులు ఈ పథకంకు అర్హులు
> వారానికి ఓసారి లక్కీ డ్రా తీసి బహుమతుల పంపిణీ
> మూడు నెలలకు ఓసారి బంపర్ డ్రా తీసి అద్భుతమైన కానుకల్ని అందజేయాలి
> పేదలు, దిగువ మధ్య తరగతి, చిరు వ్యాపారులని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని రూపొందించాలి.
> అన్నిరకాల డిజిటల్ పేమెంట్లు( యూఎస్ఎస్డీ, ఏఈపీఎస్, యూపీఐ, రూపే కార్డ్స్ వంటివి) ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలి.
> వ్యాపారుల విషయానికొస్తే, వారి వద్ద వున్న పీఓఎస్ మెషిన్పై జరిగే వ్యాపార వావాదేవీలు అన్నీ ఈ పథకానికి వర్తిస్తాయి
> నవంబర్ 8 తర్వాత డిజిటల్ పేమెంట్లు జరిపిన ప్రతీ ఒక్కరు ఈ పథకానికి అర్హులే.
> త్వరలోనే ఈ నగదురహిత చెల్లింపులకి ఇచ్చే ప్రోత్సాకాలకు సంబంధించిన పథకం మార్గదర్శకాలు, ఇతర వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్టు నీతి ఆయోగ్ తెలిపింది.