యాప్నగరం

బస్సులు, ప్రజా రవాణా త్వరలోనే ప్రారంభం: కేంద్రం

Nitin Gadkari: బస్సులు తదితర రవాణా సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Samayam Telugu 6 May 2020, 10:22 pm
ప్రజా రవాణా త్వరలో ప్రారంభం అవుతుందని కేంద్రం తెలిపింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 24 నుంచి ఆగిపోయిన ప్రజా రవాణా వ్యవస్థను పున:ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. రవాణా, జాతీయ రహదారుల పునరుద్ధరణ ప్రజలకు భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు. అయితే బస్సులు, కార్లు తదితర వాహనాలు నడపడంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోక తప్పదని అన్నారు.
Samayam Telugu ప్రజా రవాణా
Public Transport


బుధవారం (మే 6) భారత బస్సులు, కార్ల ఆపరేటర్ల సమాఖ్య సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి గడ్కరీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. అటు కరోనాపై, ఇటు ఆర్థిక మాంద్యంపై జరుగుతున్న పోరులో భారత్ విజయం సాధించి తీరుతుందని గడ్కరీ పేర్కొన్నారు. కొంత కాలం వ్యక్తిగత రక్షణ చర్యలు పాటించాల్సిందేనని చెప్పారు.

చేతులు పదేపదే కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం లాంటివి తప్పనిసరి అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రవాణా రంగానికి వడ్డీ చెల్లింపు మినహాయింపులు, ప్రజా రవాణా పునరుద్ధరణ, రాష్ట్రాల పన్నుల వాయిదా లాంటి రాయితీలు సమకూర్చాలని సమాఖ్య సభ్యులు మంత్రిని కోరారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులను తిరిగి ప్రారంభించడానికి కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: భారతీయులను తీసుకొచ్చేందుకు భారీ ఆపరేషన్‌.. లక్ష వరకు ఛార్జీలు, నిబంధనలివే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.