యాప్నగరం

ఆక్సిజన్ కు బదులు లాఫింగ్ గ్యాస్.. బాలుడు మృతి

వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలుడి ఆయుష్షును ఎనిమిదేళ్ళకే తీసేసింది.

TNN 30 May 2016, 11:06 am
వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలుడి ఆయుష్షును ఎనిమిదేళ్ళకే తీసేసింది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన ఆయుష్ (8) అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం అతన్ని శుక్రవారం నాడు స్థానిక మహారాజ యశ్వంత్ రావు ఆసుపత్రిలో తల్లిదండ్రులు చేర్చారు. ఐతే బాలుడికి శస్త్రచికిత్స చేయాలని ఆయుష్ ని ఆపరేషన్ థియేటర్ కి తరలించారు. ఇక్కడే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాలుడికి ఆక్సిజన్ అందించాల్సింది పోయి నొప్పి నివారణ కోసం అందించే లాఫింగ్ గ్యాస్ గా పిలువబడే నైట్రస్ ఆక్సైడ్ ను బాలుడికి సరఫరా చేశారు. దీంతో ఊపిరాడక బాలుడు చనిపోయాడు.
Samayam Telugu nitrous oxide instead of oxygen
ఆక్సిజన్ కు బదులు లాఫింగ్ గ్యాస్.. బాలుడు మృతి


తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆపరేషన్ థియేటర్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుమిత్ శుక్లా మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్ లో రెండు వేర్వేరు రంగుల పైపులున్నాయని ఒక దానిలో ఆక్సిజన్, మరో దానిలో నైట్రస్ ఆక్సైడ్ సరఫరా అవుతుందని పొరపాటున రెండు కలిసిపోయాయని వివరణ ఇచ్చారు. దీనిపై కమిటీ వేశామని పేర్కొన్నారు. కాగా ఆపరేషన్ థియేటర్లో ఈ పైపులను అమర్చిన కాంట్రాక్టర్ రాజేంద్ర చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే, చౌదరి మాట్లాడుతూ తన పని పైపులు అమర్చటం వరకు మాత్రమేనని ఆ పైపుల్లో సరఫరా అవుతుంది ఆక్సిజనో, ఇంకోటో చూసుకునేది మాత్రం ఆస్పత్రి వర్గాలదేనని పేర్కొన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.