ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000కు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ఈ చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ల విషయంలో సుప్రీంకోర్టు మరింత స్పష్టత ఇచ్చింది. ఐటీ యాక్ట్ - 2000లోని సెక్షన్-66A అనేది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందని.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్భంగా పేర్కొంది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేవిధంగా ఉన్నందువల్ల ఈ సెక్షన్ చట్టసమ్మతం కాదని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అరెస్టుల విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
‘సెక్షన్-66A ద్వారా పౌరుల ఆలోచనా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నేరుగా ప్రభావం పడుతోంది. ఒక వ్యక్తికి అభ్యంతరకరమైంది మరో వ్యక్తికి అభ్యంతరకరం కాకపోవచ్చు. మన రాజ్యాంగం.. పౌరులకు స్వేచ్ఛ, ఆలోచనలను వ్యక్తీకరించే హక్కును ప్రసాదించింది. వీటికి భంగం వాటిల్లేవిధంగా ఎలాంటి నిబంధనలను అంగీకరించేది లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ను పూర్తిగా కొట్టేస్తున్నట్లు తెలిపింది.
సోషల్ మీడియాలో పోస్టింగులకు సంబంధించి ఐటీ యాక్ట్- 2000లోని సెక్షన్-66Aపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. 2012లో బాల్ థాక్రే మరణించిన సందర్భంలో.. ఫేస్బుక్ అకౌంట్లో అభ్యంతకరమైన పోస్టులు పెట్టారంటూ మహారాష్ట్ర పోలీసులు ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేశారు. దీనిపై పాల్ఘర్కు చెందిన ఓ న్యాయ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
అజంఖాన్ అనే రాజకీయ నేతపై అభ్యంతకర రీతిలో పోస్టులు పెట్టాడంటూ.. ఉత్తరప్రదేశ్లో ఓ 12th స్టాండర్డ్ విద్యార్థిపైనా కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి కేసు ఒకటి నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టింగులకు సంబంధించి ఒక సమగ్ర నిబంధనలను తీసుకొచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పౌరులకు తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండాలని, అదే సమయంలో అది మరొకరి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేవిధంగా ఉండకూడదని ప్రభుత్వం వాదిస్తోంది.
‘సెక్షన్-66A ద్వారా పౌరుల ఆలోచనా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నేరుగా ప్రభావం పడుతోంది. ఒక వ్యక్తికి అభ్యంతరకరమైంది మరో వ్యక్తికి అభ్యంతరకరం కాకపోవచ్చు. మన రాజ్యాంగం.. పౌరులకు స్వేచ్ఛ, ఆలోచనలను వ్యక్తీకరించే హక్కును ప్రసాదించింది. వీటికి భంగం వాటిల్లేవిధంగా ఎలాంటి నిబంధనలను అంగీకరించేది లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ను పూర్తిగా కొట్టేస్తున్నట్లు తెలిపింది.
సోషల్ మీడియాలో పోస్టింగులకు సంబంధించి ఐటీ యాక్ట్- 2000లోని సెక్షన్-66Aపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. 2012లో బాల్ థాక్రే మరణించిన సందర్భంలో.. ఫేస్బుక్ అకౌంట్లో అభ్యంతకరమైన పోస్టులు పెట్టారంటూ మహారాష్ట్ర పోలీసులు ఇద్దరు అమ్మాయిలను అరెస్టు చేశారు. దీనిపై పాల్ఘర్కు చెందిన ఓ న్యాయ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
అజంఖాన్ అనే రాజకీయ నేతపై అభ్యంతకర రీతిలో పోస్టులు పెట్టాడంటూ.. ఉత్తరప్రదేశ్లో ఓ 12th స్టాండర్డ్ విద్యార్థిపైనా కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి కేసు ఒకటి నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టింగులకు సంబంధించి ఒక సమగ్ర నిబంధనలను తీసుకొచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పౌరులకు తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండాలని, అదే సమయంలో అది మరొకరి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేవిధంగా ఉండకూడదని ప్రభుత్వం వాదిస్తోంది.