యాప్నగరం

‘ఆప్’లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు

ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని పార్టీ అధికార ప్రతినిధి కుమార్ విశ్వాస్ ఆరోపించారు

TNN 28 Apr 2017, 3:28 pm
ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని పార్టీ అధికార ప్రతినిధి కుమార్ విశ్వాస్ ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ఓటర్ల విశ్వాసం చూరగొనలేకపోవడానికి చాలా కారణాలున్నాయని ఆయన అన్నారు.
Samayam Telugu no intra democracy in aap says kumar vishvas
‘ఆప్’లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు


ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోవడంతో ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. దీనిపై కుమార్ విశ్వాస్ ఓ ఛానల్ మాట్లాడుతూ.. పలు అంశాలను ప్రస్తావించారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత జవాన్లు తీవ్రవాదులపై సర్జికల్ దాడులు చేసినప్పుడు వాటి ‘ఆధారాలు’ బయటపెట్టాలని తమ నేత కేజ్రీవాల్ అడిగి ఉండకూడదని స్పష్టం చేశారు. సర్జికల్ దాడులపై ఆయనకు తప్పుడు అభిప్రాయం ఉందని అన్నారు.

కేజ్రీవాల్ ఢిల్లీకి సీఎం అయిన 2015 నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రతి చిన్న విషయాన్ని గొడవ పెట్టుకున్నారని.. పీఎంతో అలా వ్యవహారించి ఉండాల్సింది కాదని కుమార్ అభిప్రాయపడ్డారు.

మొన్న ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ కార్పొరేషన్ల ఎన్నికల్లోనూ ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ఆప్ నేతలు చేస్తున్న విమర్శలను కుమార్ పెద్దగా పట్టించుకోలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ అన్న అంశం ఆప్ ఓటమికి ప్రధాన కారణం కాదని చెప్పారు. ఓటర్లతో పార్టీకి మధ్య కమ్యూనికేషన్ తెగిపోయిందని, దీనిపై పార్టీ పున:సమీక్ష చేసుకోవాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.